యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం పరిధిలోని 'హజెలో ల్యాబ్స్' ఫార్మా కంపెనీలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రసాయన రియాక్టర్ తీవ్ర ఒత్తిడితో ఒక్కసారిగా పేలడంతో భారీ శబ్దం వచ్చి పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ విపత్తులో ఇద్దరు కార్మికుల పరిస్థితి విషమం, మరొక ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.రియాక్టర్ పేలుడు ధాటికి దోతిగూడెం, అంతమ్మగూడెం తదితర చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బాంబు పేలినంత శబ్దానికి భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాద స్థలం వద్ద దట్టమైన పొగతో పాటు తీవ్రమైన రసాయన ఘాటు వాసనలు వ్యాపించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, భూదాన్ పోచంపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చి, గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.గత మూడు నెలల వ్యవధిలోనే ఈ యూనిట్లో రెండోసారి ప్రమాదం జరగడంతో స్థానికులు, కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే పదే పదే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.
'హజెలో ల్యాబ్స్' ఫార్మా కంపెనీలో భారీ పేలుడు: ఇద్దరు పరిస్థితి విషమం, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
'హజెలో ల్యాబ్స్' ఫార్మా కంపెనీలో భారీ పేలుడు: ఇద్దరు పరిస్థితి విషమం, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
K.RAVI
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం పరిధిలోని 'హజెలో ల్యాబ్స్' ఫార్మా కంపెనీలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రసాయన రియాక్టర్ తీవ్ర ఒత్తిడితో ఒక్కసారిగా పేలడంతో భారీ శబ్దం వచ్చి పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ విపత్తులో ఇద్దరు కార్మికుల పరిస్థితి విషమం, మరొక ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.రియాక్టర్ పేలుడు ధాటికి దోతిగూడెం, అంతమ్మగూడెం తదితర చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బాంబు పేలినంత శబ్దానికి భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాద స్థలం వద్ద దట్టమైన పొగతో పాటు తీవ్రమైన రసాయన ఘాటు వాసనలు వ్యాపించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, భూదాన్ పోచంపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చి, గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.గత మూడు నెలల వ్యవధిలోనే ఈ యూనిట్లో రెండోసారి ప్రమాదం జరగడంతో స్థానికులు, కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే పదే పదే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి