Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉపాధ్యాయుడు మారితే… విద్యార్థి మారుతాడు! మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 22, 2026 10:55 AM

'హజెలో ల్యాబ్స్' ఫార్మా కంపెనీలో భారీ పేలుడు: ఇద్దరు పరిస్థితి విషమం, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

'హజెలో ల్యాబ్స్' ఫార్మా కంపెనీలో భారీ పేలుడు: ఇద్దరు పరిస్థితి విషమం, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

'హజెలో ల్యాబ్స్' ఫార్మా కంపెనీలో భారీ పేలుడు: ఇద్దరు పరిస్థితి విషమం, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
22-08-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం పరిధిలోని 'హజెలో ల్యాబ్స్' ఫార్మా కంపెనీలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రసాయన రియాక్టర్ తీవ్ర ఒత్తిడితో ఒక్కసారిగా పేలడంతో భారీ శబ్దం వచ్చి పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ విపత్తులో ఇద్దరు కార్మికుల పరిస్థితి విషమం, మరొక ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.రియాక్టర్ పేలుడు ధాటికి దోతిగూడెం, అంతమ్మగూడెం తదితర చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బాంబు పేలినంత శబ్దానికి భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాద స్థలం వద్ద దట్టమైన పొగతో పాటు తీవ్రమైన రసాయన ఘాటు వాసనలు వ్యాపించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, భూదాన్ పోచంపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చి, గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.గత మూడు నెలల వ్యవధిలోనే ఈ యూనిట్‌లో రెండోసారి ప్రమాదం జరగడంతో స్థానికులు, కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే పదే పదే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

Sthanikam

'హజెలో ల్యాబ్స్' ఫార్మా కంపెనీలో భారీ పేలుడు: ఇద్దరు పరిస్థితి విషమం, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం పరిధిలోని 'హజెలో ల్యాబ్స్' ఫార్మా కంపెనీలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రసాయన రియాక్టర్ తీవ్ర ఒత్తిడితో ఒక్కసారిగా పేలడంతో భారీ శబ్దం వచ్చి పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ విపత్తులో ఇద్దరు కార్మికుల పరిస్థితి విషమం, మరొక ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.రియాక్టర్ పేలుడు ధాటికి దోతిగూడెం, అంతమ్మగూడెం తదితర చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బాంబు పేలినంత శబ్దానికి భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాద స్థలం వద్ద దట్టమైన పొగతో పాటు తీవ్రమైన రసాయన ఘాటు వాసనలు వ్యాపించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, భూదాన్ పోచంపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చి, గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.గత మూడు నెలల వ్యవధిలోనే ఈ యూనిట్‌లో రెండోసారి ప్రమాదం జరగడంతో స్థానికులు, కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే పదే పదే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News