తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి, ‘శంషాబాద్ టైగర్’గా గుర్తింపు పొందిన ప్రముఖ నాయకుడు రేణిగుంట్ల గణేశ్ గుప్తా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
సమాజ సేవలో ముందుండే గణేశ్ గుప్తా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని పలువురు ఆకాంక్షించారు. ప్రజల ఆదరాభిమానాలు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గందీ సురేష్, ప్రముఖ సామాజిక కార్యకర్త నీల రవీందర్, ఫరక్నగర్ మండల ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు హన్మరి మురళీధర్, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం మెంబర్షిప్ కమిటీ చైర్మన్ మలిపెద్ది శ్రీనివాస్, గజవాడ యశ్వంత్, గడ్డం ఆంజనేయులు తదితరులు పాల్గొని గణేశ్ గుప్తాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి