నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (TRSMA) ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఎన్జీ కాలేజీ నుంచి రామగిరి మీదుగా క్లాక్టవర్ వరకు సాగిన ఈ ర్యాలీలో జిల్లాలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేలాది మంది పాల్గొనడంతో ర్యాలీకి భారీ స్పందన లభించింది.
ర్యాలీ సందర్భంగా రూపా రెడ్డి కుటుంబానికి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ప్రగాఢ సానుభూతి, సంఘీభావం తెలిపారు. విద్యారంగంలో సేవలందిస్తున్న మహిళా ప్రిన్సిపాల్పై జరిగిన దారుణ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులను గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విద్యాసంస్థల్లో భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహించాలి
TRSMA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ రావు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూపా రెడ్డి హత్య అత్యంత బాధాకరమైన ఘటన అని, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలని కోరారు. నిందితులకు చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగంలో సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయురాలిపై జరిగిన ఈ దారుణం సమాజం మొత్తాన్ని కలచివేసిందన్నారు. రూపా రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యాసంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్కరికీ భద్రత కల్పించడం అత్యంత ప్రాధాన్యత అంశమని పేర్కొన్నారు.
రాష్ట్ర నాయకులు కొలనుపాక రవికుమార్ మాట్లాడుతూ రూపా రెడ్డి కుటుంబానికి న్యాయం జరిగే వరకు విద్యా సమాజం అండగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం, పోలీస్ శాఖలు వేగంగా స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర నాయకులు ముక్కముల రామ్మోహన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి వారికి రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. రూపా రెడ్డి హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్గుబెల్లి శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఘటనపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రూపా రెడ్డి కుటుంబానికి న్యాయం జరిగే వరకు విద్యారంగం తరఫున తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
నల్లగొండ టౌన్ ప్రెసిడెంట్ నింబారి రమేష్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో సంఘీభావ ర్యాలీలో పాల్గొని తమ ఐక్యతను చాటారని అన్నారు. రూపా రెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ ర్యాలీలో నల్లగొండ పట్టణం, పరిసర ప్రాంతాలకు చెందిన వివిధ ప్రైవేట్ పాఠశాలల వ్యవహర్తలు, కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని రూపా రెడ్డి కుటుంబానికి సంఘీభావం తెలిపారు. విద్యాసంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్కరి భద్రత కోసం ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి