Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు దివీస్ ల్యాబొరేటరీస్ సీఎస్ఆర్ నిధులతో నేలపట్ల సమగ్రాభివృద్ధి: యాజమాన్యం హామీ విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 17, 2026 09:22 PM

న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు

న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు

న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు
17-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

నాగదేవతలకు ప్రత్యేక పూజలు.. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి


న్యాల్కల్, ఆగస్టు 17:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని

శ్రావణ మాస శుక్లపక్ష నాగుల పంచమి సందర్భంగా న్యాల్కల్ మండల కేంద్రంలో సోమవారం నాగుల పంచమి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో నాగదేవత విగ్రహాలు, పుట్టల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. పాలు, పసుపు, కుంకుమ సమర్పించి నాగదేవతలకు అభిషేకాలు నిర్వహించారు. వివిధ నైవేద్యాలు సమర్పించి కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.ఈ ఏడాది నాగుల పంచమి శ్రావణ సోమవారం రోజున రావడంతో పండుగకు మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. న్యాల్కల్‌లోని స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు

నిర్వహించారు.ఆలయానికి భక్తులు, మహిళలలు యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాల, వద్ద ఉదయం నుంచే భక్తుల సందడి కనిపించింది.పండుగ సందర్భంగా ఆలయాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగడంతో న్యాల్కల్ మండల కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Sthanikam

న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు

Article Image

నాగదేవతలకు ప్రత్యేక పూజలు.. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి


న్యాల్కల్, ఆగస్టు 17:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని

శ్రావణ మాస శుక్లపక్ష నాగుల పంచమి సందర్భంగా న్యాల్కల్ మండల కేంద్రంలో సోమవారం నాగుల పంచమి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో నాగదేవత విగ్రహాలు, పుట్టల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. పాలు, పసుపు, కుంకుమ సమర్పించి నాగదేవతలకు అభిషేకాలు నిర్వహించారు. వివిధ నైవేద్యాలు సమర్పించి కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.ఈ ఏడాది నాగుల పంచమి శ్రావణ సోమవారం రోజున రావడంతో పండుగకు మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. న్యాల్కల్‌లోని స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు

నిర్వహించారు.ఆలయానికి భక్తులు, మహిళలలు యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాల, వద్ద ఉదయం నుంచే భక్తుల సందడి కనిపించింది.పండుగ సందర్భంగా ఆలయాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగడంతో న్యాల్కల్ మండల కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News