నాగదేవతలకు ప్రత్యేక పూజలు.. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి
న్యాల్కల్, ఆగస్టు 17:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని
శ్రావణ మాస శుక్లపక్ష నాగుల పంచమి సందర్భంగా న్యాల్కల్ మండల కేంద్రంలో సోమవారం నాగుల పంచమి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో నాగదేవత విగ్రహాలు, పుట్టల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. పాలు, పసుపు, కుంకుమ సమర్పించి నాగదేవతలకు అభిషేకాలు నిర్వహించారు. వివిధ నైవేద్యాలు సమర్పించి కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.ఈ ఏడాది నాగుల పంచమి శ్రావణ సోమవారం రోజున రావడంతో పండుగకు మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. న్యాల్కల్లోని స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు
నిర్వహించారు.ఆలయానికి భక్తులు, మహిళలలు యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాల, వద్ద ఉదయం నుంచే భక్తుల సందడి కనిపించింది.పండుగ సందర్భంగా ఆలయాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగడంతో న్యాల్కల్ మండల కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి