Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రెండవ భద్రాద్రిగా రామగిరి రామాలయం అభివృద్ధి శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రామనవమి వేడుకలు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 27, 2026 07:45 PM

శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రామనవమి వేడుకలు

శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రామనవమి వేడుకలు

శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రామనవమి వేడుకలు
March 27, 2026 06:02 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రామనవమి వేడుకలు ఘనంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ వేడుకలలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించగా భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వేద పండితులు వేద మంత్రోచ్చారణలతో కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

కళ్యాణం సందర్భంగా ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు తయారు చేయించి, స్థానిక హనుమాన్ మందిరం నుంచి శోభాయాత్రగా తీసుకువచ్చి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వరకు తీసుకెళ్లారు. ఈ శోభాయాత్రలో భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో పాల్గొని ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ప్రదర్శించారు.

అనంతరం ఆ పవిత్ర వస్త్రాలను శ్రీ సీతారాములకు శోభాయమానంగా ధరింపజేయనున్నారు. పచ్చల హారాన్ని రామయ్యకు అలంకరించగా, లక్ష్మణుడికి రామమాడను ధరింప చేస్తారు. చైత్ర శుద్ధ నవమి రోజు అభిజిత్ లగ్న ముహూర్తం రాగానే వేద మంత్రాల నడుమ శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

అలాగే శ్రీరాముని పుట్టిన తొట్టెలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయగా, మహిళలు భక్తి గీతాలు పాడుతూ వేడుకలను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఆలయంలో భక్తి నిండిన వాతావరణం నెలకొంది.

అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో గ్రామంలోని ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, సేవా సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ వంతు సేవలను అందించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఇలాంటి ధార్మిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. శ్రీ సీతారాముల దివ్య కృపతో సమస్త ప్రజలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుకున్నారు.


న్యాల్కల్ మండల్ స్థానిక రిపోర్టర్ సంగమేశ్వర్ రెడ్డి

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News