శ్రీ సత్య సాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం చోళ్ళేమర్రి గ్రామంలో ఊరి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామ నాయకుల ఆహ్వానం మేరకు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కే. పార్థసారథి జాతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
జాతర సందర్భంగా గ్రామంలోని పలు ఇళ్లలో ఏర్పాటు చేసిన విందులకు హాజరైన ఎంపీ, స్థానిక ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకుంటూ వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ భక్తులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయన అల్లుడు శశిభూషణ్ పటేల్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై జాతరను విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి