Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:05 AM

పెద్దకాపర్తి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్

పెద్దకాపర్తి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్

పెద్దకాపర్తి  ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్
05-07-2026 239 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూలై 5: తెల్లవారుజామున చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని నల్గొండ జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) శరత్ చంద్ర పవార్ సందర్శించారు.

ప్రమాదంపై పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఎస్పీ, ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ప్రమాద స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రతా చర్యల అమలుపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఎస్పీ, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ చేపట్టి, సమగ్ర నివేదిక సమర్పించాలని పోలీసు అధికారులకు సూచించారు.

ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Sthanikam

పెద్దకాపర్తి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్

Article Image

చిట్యాల, జూలై 5: తెల్లవారుజామున చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని నల్గొండ జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) శరత్ చంద్ర పవార్ సందర్శించారు.

ప్రమాదంపై పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఎస్పీ, ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ప్రమాద స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రతా చర్యల అమలుపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఎస్పీ, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ చేపట్టి, సమగ్ర నివేదిక సమర్పించాలని పోలీసు అధికారులకు సూచించారు.

ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News