ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతం.. కేసాని రాజశేఖర్రెడ్డి మృతి.
సంతాపంగా వేడుకలు రద్దు చేసిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి.
నల్లగొండ: జన్మదిన వేడుకల ఏర్పాట్లలో విషాదం చోటుచేసుకుంది. భూపాల్రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కేసాని రాజశేఖర్రెడ్డి అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనతో విషాదం నెలకొంది.యువకుడి మృతికి సంతాపంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏర్పాటు చేసిన తన జన్మదిన వేడుకలను పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ప్రకటించారు. రాజశేఖర్రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అంతేకాకుండా మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు భూపాల్రెడ్డి ప్రకటించారు. ఈ విషాద సమయంలో అందరూ సహకరించి, కుటుంబానికి అండగా నిలవాలని ఆయన కోరారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి