Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:28 AM

జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం

జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం

జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం
25-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతం.. కేసాని రాజశేఖర్‌రెడ్డి మృతి.

సంతాపంగా వేడుకలు రద్దు చేసిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి.

నల్లగొండ: జన్మదిన వేడుకల ఏర్పాట్లలో విషాదం చోటుచేసుకుంది. భూపాల్‌రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కేసాని రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనతో విషాదం నెలకొంది.యువకుడి మృతికి సంతాపంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏర్పాటు చేసిన తన జన్మదిన వేడుకలను పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రకటించారు. రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అంతేకాకుండా మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు భూపాల్‌రెడ్డి ప్రకటించారు. ఈ విషాద సమయంలో అందరూ సహకరించి, కుటుంబానికి అండగా నిలవాలని ఆయన కోరారు.

Sthanikam

జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం

Article Image

ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతం.. కేసాని రాజశేఖర్‌రెడ్డి మృతి.

సంతాపంగా వేడుకలు రద్దు చేసిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి.

నల్లగొండ: జన్మదిన వేడుకల ఏర్పాట్లలో విషాదం చోటుచేసుకుంది. భూపాల్‌రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కేసాని రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనతో విషాదం నెలకొంది.యువకుడి మృతికి సంతాపంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏర్పాటు చేసిన తన జన్మదిన వేడుకలను పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రకటించారు. రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అంతేకాకుండా మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు భూపాల్‌రెడ్డి ప్రకటించారు. ఈ విషాద సమయంలో అందరూ సహకరించి, కుటుంబానికి అండగా నిలవాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News