బోనం ఎత్తుకున్న గ్రామ సర్పంచ్ బద్దం యాదమ్మ యాదగిరి
రామన్నపేట: మండలంలోని కొత్తగూడెం గ్రామంలో మారెమ్మ–పాపమ్మ బోనాల పండుగను సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలు ఎత్తుకుని అమ్మవార్లకు బెల్లం నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
గ్రామ సర్పంచ్ బద్దం యాదమ్మ యాదగిరి బోనం ఎత్తుకుని అమ్మవార్లకు సమర్పించారు. గ్రామాన్ని చల్లగా చూడాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవార్లను వేడుకున్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నీల ఆంజనేయులు, వార్డు సభ్యులు జావదీ కిషోర్, కోయగూరి సరిత, నీల రేణుక, భీమకాని అంజమ్మ, అంబటి రాజేశ్వరి, పొట్ట సుగుణమ్మ, బాత్క సైదులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి