రామన్నపేట
పాత్రికేయ రంగానికి సీనియర్ జర్నలిస్టు ఎండి ఇబ్రహీం మృతి తీరనిలోటు అని నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. సోమవారం రామన్నపేట పాత్రికేయ బృందవ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇబ్రహీం సంతాప సభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు పాత్రికేయ రంగంలో 50 సంవత్సరాలు పైగా ఒకే పత్రికలో పనిచేసిన గొప్ప వ్యక్తి ఎంపీ ఇబ్రహీం అని కొనియాడారు. ఎవరితోనూ విభేదాలు లేకుండా అందర్నీ కలుపుగోలుగా కలుపుకొని అందరి మండల లో పొందిన వ్యక్తి ఇబ్రహీం ఒక్కరేనని అన్నారు. 2018 నుండి తనకు ఎంతో సానిహితంగా ఉంటూ ఎప్పటికప్పుడు తనతో మాట్లాడుతూ పలు సమస్యలపై చర్చించేవారు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు.
సీనియర్ పాత్రికేయ రంగంలో ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తు పాత్రికేయ రంగంలో నిబద్ధత కలిగిన వ్యక్తి ఇబ్రహీం ఒక్కరేనని కొనియాడారు. ఆయన మృతి ప్రతి ఒక్కరికి తీరనిలోటని ఎల్లవేళలా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, మండల పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి