బాల్యవివాహాల నిరోధానికి కఠిన చర్యలు: సర్పంచ్ భారతమ్మ
చిన్నారుల హక్కులు, సంరక్షణ కోసమే కమిటీ: ఎం. మత్స్యగిరి
చౌటుప్పల్ మండల పరిధిలోని జై కేసారం గ్రామంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డిసీపియు) ఆధ్వర్యంలో సోమవారం 'బాలల పరిరక్షణ కమిటీ'ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీపీయూ సోషల్ వర్కర్ ఎం. మత్స్యగిరి మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో పిల్లల రక్షణ, సంరక్షణ కోసం సర్పంచ్ చైర్మన్గా 14 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనాధ పిల్లలకు స్కాలర్షిప్ సౌకర్యం ఉందన్న ఆయన, దత్తత ప్రక్రియను చట్టబద్ధంగానే చేపట్టాలని సూచించారు. గ్రామంలో పిల్లల సమస్యలపై కమిటీలో చర్చించి పరిష్కరిస్తామన్నారు. గ్రామ సర్పంచ్ సమ్మిరెడ్డి భారతమ్మ మాట్లాడుతూ.. గ్రామంలో బాల్యవివాహాలు జరగకుండా చూడాలని, బడి మానేసిన పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రతి నెలా కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దశరథ, స్కోప్ (ఎన్ జీఓ) ప్రతినిధి నరసింహరాజు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి