Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాలలో యువకుడి ఆత్మహత్య అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 09:22 PM

జై కేసారంలో ‘బాలల పరిరక్షణ కమిటీ’ ఏర్పాటు

జై కేసారంలో ‘బాలల పరిరక్షణ కమిటీ’ ఏర్పాటు

జై కేసారంలో ‘బాలల పరిరక్షణ కమిటీ’ ఏర్పాటు
24-08-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బాల్యవివాహాల నిరోధానికి కఠిన చర్యలు: సర్పంచ్ భారతమ్మ

చిన్నారుల హక్కులు, సంరక్షణ కోసమే కమిటీ: ఎం. మత్స్యగిరి

చౌటుప్పల్ మండల పరిధిలోని జై కేసారం గ్రామంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డిసీపియు) ఆధ్వర్యంలో సోమవారం 'బాలల పరిరక్షణ కమిటీ'ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీపీయూ సోషల్ వర్కర్ ఎం. మత్స్యగిరి మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో పిల్లల రక్షణ, సంరక్షణ కోసం సర్పంచ్ చైర్మన్‌గా 14 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనాధ పిల్లలకు స్కాలర్‌షిప్ సౌకర్యం ఉందన్న ఆయన, దత్తత ప్రక్రియను చట్టబద్ధంగానే చేపట్టాలని సూచించారు. గ్రామంలో పిల్లల సమస్యలపై కమిటీలో చర్చించి పరిష్కరిస్తామన్నారు. ​గ్రామ సర్పంచ్ సమ్మిరెడ్డి భారతమ్మ మాట్లాడుతూ.. గ్రామంలో బాల్యవివాహాలు జరగకుండా చూడాలని, బడి మానేసిన పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రతి నెలా కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దశరథ, స్కోప్ (ఎన్ జీఓ) ప్రతినిధి నరసింహరాజు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జై కేసారంలో ‘బాలల పరిరక్షణ కమిటీ’ ఏర్పాటు

Article Image

బాల్యవివాహాల నిరోధానికి కఠిన చర్యలు: సర్పంచ్ భారతమ్మ

చిన్నారుల హక్కులు, సంరక్షణ కోసమే కమిటీ: ఎం. మత్స్యగిరి

చౌటుప్పల్ మండల పరిధిలోని జై కేసారం గ్రామంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డిసీపియు) ఆధ్వర్యంలో సోమవారం 'బాలల పరిరక్షణ కమిటీ'ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీపీయూ సోషల్ వర్కర్ ఎం. మత్స్యగిరి మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో పిల్లల రక్షణ, సంరక్షణ కోసం సర్పంచ్ చైర్మన్‌గా 14 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనాధ పిల్లలకు స్కాలర్‌షిప్ సౌకర్యం ఉందన్న ఆయన, దత్తత ప్రక్రియను చట్టబద్ధంగానే చేపట్టాలని సూచించారు. గ్రామంలో పిల్లల సమస్యలపై కమిటీలో చర్చించి పరిష్కరిస్తామన్నారు. ​గ్రామ సర్పంచ్ సమ్మిరెడ్డి భారతమ్మ మాట్లాడుతూ.. గ్రామంలో బాల్యవివాహాలు జరగకుండా చూడాలని, బడి మానేసిన పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రతి నెలా కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దశరథ, స్కోప్ (ఎన్ జీఓ) ప్రతినిధి నరసింహరాజు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News