సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్లిపూర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కేవలం రూ.500 కోసం కన్న తండ్రినే కుమారుడు కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. అల్లిపూర్కు చెందిన తుకారం (35) తన ప్యాంట్ జేబులో పెట్టుకున్న రూ.500 నగదు కనిపించకపోవడంతో, ఆ డబ్బును తన తండ్రే తీసుకున్నాడని అనుమానించాడు. తండ్రి తాను డబ్బులు తీసుకోలేదని చెప్పినా తుకారం వినకుండా ఆయనతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురై కత్తితో తండ్రిపై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
PRINT TIME: August 20, 2026 10:33 PM
రూ.500 కోసం కన్న తండ్రినే హత్య చేసిన కుమారుడు
రూ.500 కోసం కన్న తండ్రినే హత్య చేసిన కుమారుడు
20-08-2026
153 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్లిపూర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కేవలం రూ.500 కోసం కన్న తండ్రినే కుమారుడు కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. అల్లిపూర్కు చెందిన తుకారం (35) తన ప్యాంట్ జేబులో పెట్టుకున్న రూ.500 నగదు కనిపించకపోవడంతో, ఆ డబ్బును తన తండ్రే తీసుకున్నాడని అనుమానించాడు. తండ్రి తాను డబ్బులు తీసుకోలేదని చెప్పినా తుకారం వినకుండా ఆయనతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురై కత్తితో తండ్రిపై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి