Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రూ.500 కోసం కన్న తండ్రినే హత్య చేసిన కుమారుడు తరగతి గదిలో గురువులు.. ఉద్యోగంలో మాత్రం అతిథులే! కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 20, 2026 10:33 PM

నారాయణఖేడ్‌లో డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయ సేకరణ

నారాయణఖేడ్‌లో డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయ సేకరణ

నారాయణఖేడ్‌లో డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయ సేకరణ
20-08-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రంలో సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి నియామక ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏఐసీసీ పరిశీలకులు దీపక్ రాథోడ్, టీపీసీసీ పరిశీలకులు దుద్దిళ్ల శ్రీనుబాబు, రియాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల బాధ్యులు, సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పరిశీలకులు సమావేశమై డీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సమర్థవంతమైన నాయకుడిని డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని నాయకులు కోరారు. పార్టీ శ్రేణుల నుంచి సేకరించిన అభిప్రాయాలను అధిష్టానానికి నివేదించి, అందరి సూచనలు పరిగణనలోకి తీసుకుని త్వరలోనే డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటామని పరిశీలకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్ ,సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల స్థాయి అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, ఇతర అనుబంధ సంఘాల బాధ్యులు, భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణఖేడ్‌లో డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయ సేకరణ

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రంలో సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి నియామక ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏఐసీసీ పరిశీలకులు దీపక్ రాథోడ్, టీపీసీసీ పరిశీలకులు దుద్దిళ్ల శ్రీనుబాబు, రియాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల బాధ్యులు, సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పరిశీలకులు సమావేశమై డీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సమర్థవంతమైన నాయకుడిని డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని నాయకులు కోరారు. పార్టీ శ్రేణుల నుంచి సేకరించిన అభిప్రాయాలను అధిష్టానానికి నివేదించి, అందరి సూచనలు పరిగణనలోకి తీసుకుని త్వరలోనే డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటామని పరిశీలకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్ ,సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల స్థాయి అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, ఇతర అనుబంధ సంఘాల బాధ్యులు, భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News