నాగారం; మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82 వ జయంతి పురస్కరించుకొని నాగారం మండల పార్టీ అధ్యక్షుడు వారి చిత్ర పటానికి ఘనంగా నివాళులు అర్పించిన ఆయన మాట్లాడుతూ నేడు దేశం ఆర్థికంగా,శాస్త్ర,సాంకేతికంగా పురోగమించడానికి రాజీవ్ గాంధీ కృషి చేశాడని కొనియాడారు.టెలిఫోన్,కంప్యూటర్ లాంటి ఆధునిక సాంకేతిక రంగాలను భారత్ లో ప్రవేశపెట్టి దేశ అభివృద్ధికి పాటుపడిన గొప్ప నేత అని అన్నారు.21 సంవత్సరాలకు ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలు చేసి యువతను దేశ రాజకీయాల్లో భాగస్వామ్యం చేసిన మహానీయుడని పేర్కొన్నారు. దేశం కోసం బలి ధనం చేసిన రాజీవ్ గాంధీని దేశం ఎప్పటికీ మరువబోదని అన్నారు...
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సర్పంచులు, మాజీ ఎంపిటిసి లు,, యూత్ కాంగ్రెస్ నాయకులు వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.....
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి