ఘనంగా 187వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ
ఫొటోగ్రఫీ అనేది కేవలం ఒక వృత్తి కాదని, మానవ జీవితంలోని మధుర జ్ఞాపకాలను సజీవంగా నిలిపే అద్భుతమైన కళ అని చౌటుప్పల్ మండల ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుక్క స్వామి అన్నారు.187వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫొటో, వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్లో అసోసియేషన్ జెండాను బుధవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సుక్క స్వామి మాట్లాడుతూ.. కెమెరా వెనుక నిలబడి ఎంతోమంది జీవితాల్లోని చిరునవ్వులను బంధిస్తున్న ప్రతి ఫొటోగ్రాఫర్కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 'కళను గౌరవిద్దాం – ఫొటోగ్రాఫర్ను గౌరవిద్దాం' అని ఆయన పిలుపునిచ్చారు. దినోత్సవ వేడుకల అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి సభ్యులు తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కాటం రాజు, జిల్లా సలహాదారుడు విశ్వనాధ్ చంద్రశేఖర్, జిల్లా గౌరవ సలహాదారుడు రవీందర్, చౌటుప్పల్ మాజీ అధ్యక్షులు తోర్పునూరి సాయిలు గౌడ్, సీనియర్ ఫోటోగ్రాఫర్లు చింతల గణేష్, కత్తుల రవి, కందగట్ల కృష్ణ, మెట్టు రామచంద్ర రెడ్డి, జక్కా చలమందరెడ్డి, చౌటుప్పల్ మండలం ప్రధాన కార్యదర్శి వనం రుషి, కోశాధికారి రోషణ గారి రాఘవేంద్ర గౌడ్, ఉపాధ్యక్షులు ఎర్ర శివ, వరికుప్పల మహేష్, పల్లెర్ల సుజిక్, ప్రచార కార్యదర్శి పగడాల శంకర్, కార్యవర్గ సభ్యులు మలిగే రవి, పగిళ్ల మహేష్, దాకోజి నాని, జాజుల రామకృష్ణ, పెడకంటి నాగేందర్, సంతోష్, ప్రవీణ్, రమేష్, పరమేష్, తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి