Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అర్హులకే మంజూరు చేయాలి కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 19, 2026 06:04 PM

ఫోటోగ్రాఫర్ల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి

ఫోటోగ్రాఫర్ల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి

ఫోటోగ్రాఫర్ల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి
19-08-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రభుత్వం ఫోటో, వీడియో గ్రాఫర్లకు సబ్సిడీపై రుణాలు అందించి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని సదాశివపేట పట్టణ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగుల విజయ్ కుమార్ కోరారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సదాశివపేటలో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ కెమెరా కేవలం పరికరం మాత్రమే కాదని, అది ఫోటోగ్రాఫర్ల వృత్తికి గుర్తింపు అని అన్నారు. చరిత్రను భద్రపరిచే బాధ్యత ఫోటోగ్రాఫర్లపై ఉందన్నారు. యువ ఫోటోగ్రాఫర్లు ఆధునిక సాంకేతికతను నేర్చుకుని ఫోటోగ్రఫీతో పాటు వీడియో, డ్రోన్, ఎడిటింగ్, ఆల్బమ్ డిజైన్, సామాజిక మాధ్యమాల కంటెంట్, కృత్రిమ మేధస్సు వంటి నూతన రంగాల్లో నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. ఫోటోగ్రాఫర్ల ఐక్యతే తమ బలమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ముదిగొండ జయచింతన్, కోశాధికారి కర్ణాకర్, ఉపాధ్యక్షులు కాషా సంగమేశ్వర్, వై. మహేష్, శివశంకర్, గొల్లపల్లి శ్రీనివాస్, రుమాండ్ల రాజు, బండారి సుభాష్, ఎం. సంతోష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫోటోగ్రాఫర్ల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి

Article Image

ప్రభుత్వం ఫోటో, వీడియో గ్రాఫర్లకు సబ్సిడీపై రుణాలు అందించి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని సదాశివపేట పట్టణ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగుల విజయ్ కుమార్ కోరారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సదాశివపేటలో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ కెమెరా కేవలం పరికరం మాత్రమే కాదని, అది ఫోటోగ్రాఫర్ల వృత్తికి గుర్తింపు అని అన్నారు. చరిత్రను భద్రపరిచే బాధ్యత ఫోటోగ్రాఫర్లపై ఉందన్నారు. యువ ఫోటోగ్రాఫర్లు ఆధునిక సాంకేతికతను నేర్చుకుని ఫోటోగ్రఫీతో పాటు వీడియో, డ్రోన్, ఎడిటింగ్, ఆల్బమ్ డిజైన్, సామాజిక మాధ్యమాల కంటెంట్, కృత్రిమ మేధస్సు వంటి నూతన రంగాల్లో నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. ఫోటోగ్రాఫర్ల ఐక్యతే తమ బలమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ముదిగొండ జయచింతన్, కోశాధికారి కర్ణాకర్, ఉపాధ్యక్షులు కాషా సంగమేశ్వర్, వై. మహేష్, శివశంకర్, గొల్లపల్లి శ్రీనివాస్, రుమాండ్ల రాజు, బండారి సుభాష్, ఎం. సంతోష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News