యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు రెండు కంప్యూటర్లు, ఒక ప్రింటర్ను బహూకరించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు వెల్లంకి మాజీ ఎంపీటీసీ, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ తిమ్మాపురం మహేందర్రెడ్డి పాఠశాలకు ఈ పరికరాలను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఇడెం రాధ శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు సహకరిస్తున్నారని, శిథిలావస్థలో ఉన్న గదుల స్థానంలో కొత్త గదులు మంజూరు చేయించాలని ఎమ్మెల్యేను కోరారు. మహేందర్రెడ్డి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటామని, ఎమ్మెల్యే సహకారంతో రెండు అదనపు గదులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో ఏఏపిసి చైర్పర్సన్ పులగం సులోచన, ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్రెడ్డి, ఉపాధ్యాయులు ఇట్టే సోమిరెడ్డి, ఉయ్యాల బిక్షమయ్య, మందుగుల వెంకటయ్య, ఇడెం స్వరూప సేవా ట్రస్ట్ చైర్మన్ ఇడెం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిటిపాముల పెద్దులు, నాయకులు గంజి నర్సింహ, భాస్కర్, చక్రపాణి, గోషిక కొండల్రెడ్డి, కనుత్తాల భాస్కర్రెడ్డి, ఎడ్ల సంజీవరెడ్డి, రుద్ర వెంకటేష్, మిరియాల నరేశ్, మిరియాల వెంకటేష్, గోధుమల సోమప్ప తదితరులు పాల్గొన్నారు.
వెల్లంకి పాఠశాలకు కంప్యూటర్లు బహూకరణ
వెల్లంకి పాఠశాలకు కంప్యూటర్లు బహూకరణ
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు రెండు కంప్యూటర్లు, ఒక ప్రింటర్ను బహూకరించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు వెల్లంకి మాజీ ఎంపీటీసీ, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ తిమ్మాపురం మహేందర్రెడ్డి పాఠశాలకు ఈ పరికరాలను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఇడెం రాధ శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు సహకరిస్తున్నారని, శిథిలావస్థలో ఉన్న గదుల స్థానంలో కొత్త గదులు మంజూరు చేయించాలని ఎమ్మెల్యేను కోరారు. మహేందర్రెడ్డి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటామని, ఎమ్మెల్యే సహకారంతో రెండు అదనపు గదులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో ఏఏపిసి చైర్పర్సన్ పులగం సులోచన, ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్రెడ్డి, ఉపాధ్యాయులు ఇట్టే సోమిరెడ్డి, ఉయ్యాల బిక్షమయ్య, మందుగుల వెంకటయ్య, ఇడెం స్వరూప సేవా ట్రస్ట్ చైర్మన్ ఇడెం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిటిపాముల పెద్దులు, నాయకులు గంజి నర్సింహ, భాస్కర్, చక్రపాణి, గోషిక కొండల్రెడ్డి, కనుత్తాల భాస్కర్రెడ్డి, ఎడ్ల సంజీవరెడ్డి, రుద్ర వెంకటేష్, మిరియాల నరేశ్, మిరియాల వెంకటేష్, గోధుమల సోమప్ప తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి