రామన్నపేట: సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి ఉత్సవాలను రామన్నపేట మండలంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వివిధ కుల సంఘాల నాయకులు, గౌడ కులస్తులు, బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సమాజంలోని అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఆయన ధైర్యసాహసాలు, సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పాపన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జయంతి వేడుకల్లో వివిధ కుల సంఘాలు, బీసీ సంఘాల నాయకులు, గౌడ కులస్తులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి