పెదటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్తో పాటు బీఆర్ఎస్ నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ పాండుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో అండగా నిలిచాయని, హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ వాటిని నిలిపివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేదని విమర్శించారు.పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులకు వెంటనే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ పేద ఆడబిడ్డలకు అండగా నిలిచే ఈ పథకాలను కొనసాగించాలని, వాటిని రద్దు చేసే ప్రయత్నాలను బీఆర్ఎస్ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. పథకాలను కొనసాగించడంతో పాటు పెండింగ్లో ఉన్న లబ్ధిదారులకు వెంటనే సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి: సంగారెడ్డి ఎమ్మెల్యే, జహీరాబాద్ ఎమ్మెల్యే ,ఆందోల్ మాజీ ఎమ్మెల్యే
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి: సంగారెడ్డి ఎమ్మెల్యే, జహీరాబాద్ ఎమ్మెల్యే ,ఆందోల్ మాజీ ఎమ్మెల్యే
Krishna
పెదటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్తో పాటు బీఆర్ఎస్ నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ పాండుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో అండగా నిలిచాయని, హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ వాటిని నిలిపివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేదని విమర్శించారు.పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులకు వెంటనే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ పేద ఆడబిడ్డలకు అండగా నిలిచే ఈ పథకాలను కొనసాగించాలని, వాటిని రద్దు చేసే ప్రయత్నాలను బీఆర్ఎస్ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. పథకాలను కొనసాగించడంతో పాటు పెండింగ్లో ఉన్న లబ్ధిదారులకు వెంటనే సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి