భారత మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షులు మినహాజ్ బుట్టు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. బీజేపీ కార్యాలయంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సందర్భంగా మినహాజ్ బుట్టు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి గొప్ప రాజనీతిజ్ఞుడు, కవి, ప్రజానాయకుడిగా దేశానికి విశిష్ట సేవలు అందించారని, అందరినీ కలుపుకుని ముందుకు సాగడం ఆయన ప్రత్యేకత అని అన్నారు.సుపరిపాలన, దేశాభివృద్ధి కోసం వాజ్పేయి చూపిన మార్గంలో ముందుకు సాగుతామని తెలిపారు. పోఖ్రాన్ అణు పరీక్షలు, స్వర్ణ చతుర్భుజి రహదారుల ప్రాజెక్టు వంటి ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం బీజేపీ సంగారెడ్డి జిల్లా మైనారిటీ మోర్చాకు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మైనారిటీ మోర్చా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
వాజ్పేయి వర్ధంతి సందర్భంగా నివాళులు.. నూతన కమిటీ సభ్యులకు సన్మానం
వాజ్పేయి వర్ధంతి సందర్భంగా నివాళులు.. నూతన కమిటీ సభ్యులకు సన్మానం
Krishna
భారత మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షులు మినహాజ్ బుట్టు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. బీజేపీ కార్యాలయంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సందర్భంగా మినహాజ్ బుట్టు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి గొప్ప రాజనీతిజ్ఞుడు, కవి, ప్రజానాయకుడిగా దేశానికి విశిష్ట సేవలు అందించారని, అందరినీ కలుపుకుని ముందుకు సాగడం ఆయన ప్రత్యేకత అని అన్నారు.సుపరిపాలన, దేశాభివృద్ధి కోసం వాజ్పేయి చూపిన మార్గంలో ముందుకు సాగుతామని తెలిపారు. పోఖ్రాన్ అణు పరీక్షలు, స్వర్ణ చతుర్భుజి రహదారుల ప్రాజెక్టు వంటి ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం బీజేపీ సంగారెడ్డి జిల్లా మైనారిటీ మోర్చాకు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మైనారిటీ మోర్చా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి