Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా నివాళులు.. నూతన కమిటీ సభ్యులకు సన్మానం విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 16, 2026 11:01 PM

వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా నివాళులు.. నూతన కమిటీ సభ్యులకు సన్మానం

వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా నివాళులు.. నూతన కమిటీ సభ్యులకు సన్మానం

వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా నివాళులు.. నూతన కమిటీ సభ్యులకు సన్మానం
16-08-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

భారత మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షులు మినహాజ్ బుట్టు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సందర్భంగా మినహాజ్ బుట్టు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్‌పేయి గొప్ప రాజనీతిజ్ఞుడు, కవి, ప్రజానాయకుడిగా దేశానికి విశిష్ట సేవలు అందించారని, అందరినీ కలుపుకుని ముందుకు సాగడం ఆయన ప్రత్యేకత అని అన్నారు.సుపరిపాలన, దేశాభివృద్ధి కోసం వాజ్‌పేయి చూపిన మార్గంలో ముందుకు సాగుతామని తెలిపారు. పోఖ్రాన్ అణు పరీక్షలు, స్వర్ణ చతుర్భుజి రహదారుల ప్రాజెక్టు వంటి ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం బీజేపీ సంగారెడ్డి జిల్లా మైనారిటీ మోర్చాకు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మైనారిటీ మోర్చా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా నివాళులు.. నూతన కమిటీ సభ్యులకు సన్మానం

Article Image

భారత మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షులు మినహాజ్ బుట్టు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సందర్భంగా మినహాజ్ బుట్టు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్‌పేయి గొప్ప రాజనీతిజ్ఞుడు, కవి, ప్రజానాయకుడిగా దేశానికి విశిష్ట సేవలు అందించారని, అందరినీ కలుపుకుని ముందుకు సాగడం ఆయన ప్రత్యేకత అని అన్నారు.సుపరిపాలన, దేశాభివృద్ధి కోసం వాజ్‌పేయి చూపిన మార్గంలో ముందుకు సాగుతామని తెలిపారు. పోఖ్రాన్ అణు పరీక్షలు, స్వర్ణ చతుర్భుజి రహదారుల ప్రాజెక్టు వంటి ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం బీజేపీ సంగారెడ్డి జిల్లా మైనారిటీ మోర్చాకు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మైనారిటీ మోర్చా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News