రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన పావిరాల నాగరాజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్తమ 102 అంబులెన్స్ పైలట్గా అవార్డు అందుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ ఆకాంక్ష యాదవ్ చేతుల మీదుగా నాగరాజు ఈ అవార్డును అందుకున్నారు.
102 అంబులెన్స్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు.. ఎప్పుడు ఫోన్ వచ్చినా వెంటనే స్పందిస్తూ, నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో సేవలందిస్తున్నారు. రామన్నపేట ఏరియా పరిధితో పాటు మునిపంపుల, వలిగొండ, వేములకొండ తదితర ప్రాంతాల్లోని గ్రామాల నుంచి గర్భిణులు, అత్యవసర రోగులను సురక్షితంగా ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రసవం అనంతరం తల్లీబిడ్డలను క్షేమంగా ఇళ్లకు చేర్చడంలోనూ సేవలు అందిస్తున్నారు.
తన విధి నిర్వహణలో అంకితభావం, సమయస్ఫూర్తి, సేవా దృక్పథాన్ని గుర్తించిన అధికారులు ఉత్తమ 102 అంబులెన్స్ పైలట్ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డు అందుకోవడంతో నాగరాజును తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, బంధువులు, గ్రామస్తులు, స్నేహితులు అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి