మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) దుస్థితిపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. శనివారం బీఎస్పీ చండూరు మండల అధ్యక్షుడు కడారి సైదులు ఆధ్వర్యంలో నాయకులు ఆసుపత్రిని పరిశీలించారు.ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ అయితరాజు అభయేందర్ మాట్లాడుతూ.. సుమారు 40 వేల జనాభా ఉన్న ప్రాంతానికి కేవలం ఆరు పడకలతో ఆసుపత్రి నడపడం దారుణమన్నారు. భవనం శిథిలావస్థకు చేరిందని, కిటికీల అద్దాలు, తలుపులు విరిగిపోయి రోగులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయని మండిపడ్డారు. అత్యవసర సమయంలో పేద ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తోందన్నారు.స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. చండూరు పీహెచ్సీని తక్షణమే 100 పడకలకు పెంచి, అవసరమైన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, వైద్య పరికరాలను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కత్తుల పరమేష్, నియోజకవర్గ ఇంచార్జి బొట్ట శివ, చండూరు మున్సిపల్ అధ్యక్షురాలు పద్మ, అన్నపాక శంకర్, రుషిపాక మాణిక్యం, మర్రిగూడ మండల అధ్యక్షులు నాగిళ్ల మారయ్య, గట్టుప్పల్ మండల అధ్యక్షులు భరిగాలా వినోద్, నారాయణపురం మండల అధ్యక్షులు ఎర్రోళ్ల గిరి, మండల ఉపాధ్యక్షులు గొందిగళ్ల కృష్ణ, నాయకులు రాజు, శేఖర్, నవీన్, శంకర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చండూరు పీహెచ్సీని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలి: అయితరాజు అభయేందర్
చండూరు పీహెచ్సీని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలి: అయితరాజు అభయేందర్
K.RAVI
మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) దుస్థితిపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. శనివారం బీఎస్పీ చండూరు మండల అధ్యక్షుడు కడారి సైదులు ఆధ్వర్యంలో నాయకులు ఆసుపత్రిని పరిశీలించారు.ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ అయితరాజు అభయేందర్ మాట్లాడుతూ.. సుమారు 40 వేల జనాభా ఉన్న ప్రాంతానికి కేవలం ఆరు పడకలతో ఆసుపత్రి నడపడం దారుణమన్నారు. భవనం శిథిలావస్థకు చేరిందని, కిటికీల అద్దాలు, తలుపులు విరిగిపోయి రోగులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయని మండిపడ్డారు. అత్యవసర సమయంలో పేద ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తోందన్నారు.స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. చండూరు పీహెచ్సీని తక్షణమే 100 పడకలకు పెంచి, అవసరమైన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, వైద్య పరికరాలను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కత్తుల పరమేష్, నియోజకవర్గ ఇంచార్జి బొట్ట శివ, చండూరు మున్సిపల్ అధ్యక్షురాలు పద్మ, అన్నపాక శంకర్, రుషిపాక మాణిక్యం, మర్రిగూడ మండల అధ్యక్షులు నాగిళ్ల మారయ్య, గట్టుప్పల్ మండల అధ్యక్షులు భరిగాలా వినోద్, నారాయణపురం మండల అధ్యక్షులు ఎర్రోళ్ల గిరి, మండల ఉపాధ్యక్షులు గొందిగళ్ల కృష్ణ, నాయకులు రాజు, శేఖర్, నవీన్, శంకర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి