కాంగ్రెస్, బీజేపీకి షాక్.. టీఆర్పీలోకి భారీగా చేరికలు
కాంగ్రెస్, బీజేపీకి షాక్.. టీఆర్పీలోకి భారీగా చేరికలు
K.RAVI
చౌటుప్పల్ మున్సిపల్ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రసాని రాధిక నియామకం
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆశీస్సులతో పలువురు నాయకులు, కార్యకర్తలు భారీగా ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ మండల అధ్యక్షుడు కడ్తాల యాదగిరి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. మునుగోడు నియోజకవర్గ ఇంచార్జి శికాలమెట్ల సతీష్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపల్ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రసాని రాధికను నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానంగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో రాజ్యాధికార పార్టీతోనే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి