మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: సీఐ మన్మథకుమార్
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: సీఐ మన్మథకుమార్
K.RAVI
నారాయణ పాఠశాలలో విద్యార్థులకు ‘నార్కోటిక్స్’పై అవగాహన సదస్సు
మాదకద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తుతో పాటు కుటుంబాలు, సమాజం తీవ్రంగా దెబ్బతింటాయని చౌటుప్పల్ సీఐ జి.మన్మథకుమార్ హెచ్చరించారు. చౌటుప్పల్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో సోమవారం విద్యార్థులకు నార్కోటిక్స్ (మాదకద్రవ్యాల) దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎలాంటి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాల బారిన పడకూడదని, చెడు స్నేహాలు, ప్రలోభాలకు లోనుకాకుండా చదువుపైనే దృష్టి సారించి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. మాదకద్రవ్యాల విక్రయం, రవాణా లేదా వినియోగానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులందరూ మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తామని, డ్రగ్స్కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి