అమ్మ జ్ఞాపకార్థం.. సేవా కార్యక్రమాలు
అమ్మ జ్ఞాపకార్థం.. సేవా కార్యక్రమాలు
K.RAVI
మసీద్గూడెం గ్రామ సర్పంచ్ మర్రి వంశీదర్ రెడ్డి కుటుంబం
మసీద్గూడెం గ్రామానికి చెందిన కీ.శే. మర్రి సరస్వతి జ్ఞాపకార్థం ఆమె కుమారుడు, మసీద్గూడెం సర్పంచ్ మర్రి వంశీదర్ రెడ్డి, కుమార్తె మానస, అల్లుడు కార్తీక్ రెడ్డిల ఆధ్వర్యంలో శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తల్లి చిన్నతనంలో చదువుకున్న నేలపట్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, పండ్లు పంపిణీ చేయడంతో పాటు పాఠశాల అవసరాల కోసం బీరువాను అందజేశారు. అనంతరం పెద్దకొండూర్లోని సాయి యాదాద్రి ఆశ్రమ వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి, మరొక బీరువాను అందజేశారు. తల్లిదండ్రుల జ్ఞాపకాలను సమాజ సేవ ద్వారా నిలుపుకోవడం అందరి బాధ్యత అని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మర్రి రాంరెడ్డి, నేలపట్ల సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్, మందోళ్లగూడెం ఉపసర్పంచ్ సుర్కంటి శ్రీధర్ రెడ్డి, పెద్దకొండూర్ మాజీ ఎంపీటీసీ బద్దం కొండల్ రెడ్డి, పెద్దకొండూర్ ఉపసర్పంచ్ పిన్నిటి శ్రీనివాస్ రెడ్డి, కుటుంబ సభ్యులు పడమటి ఉమాదేవి, పడమటి బలవంత్ రెడ్డి, సుర్కంటి సురేందర్ రెడ్డి, వాకిటి శివారెడ్డి, రామిడి జంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి