Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీటీడీ కల్యాణ మండపం భూమికి హద్దుల నిర్ణయం. న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 01:39 PM

పత్తి పంట ఎండిపోయిందని రైతు బలవన్మరణం

పత్తి పంట ఎండిపోయిందని రైతు బలవన్మరణం

పత్తి పంట ఎండిపోయిందని రైతు బలవన్మరణం
08-09-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య.. కుటుంబంలో విషాదం.

చండూరు: పత్తి పంట పూర్తిగా ఎండిపోవడంతో పెట్టుబడి నష్టం తప్పదన్న మనస్తాపంతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నల్గొండ జిల్లా చండూరు మండలంలో చోటుచేసుకుంది.

అంగడిపేటకు చెందిన పనస రాములు (55) సోమవారం తన పొలానికి వెళ్లాడు. పత్తి పంట ఎండిపోయి చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో పొలంలోనే పురుగుల మందు తాగాడు.

సాయంత్రం అయినా రాములు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

రైతు మృతితో అంగడిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చే దశలో పంట ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన రైతు ఈ నిర్ణయం తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.


Sthanikam

పత్తి పంట ఎండిపోయిందని రైతు బలవన్మరణం

Article Image

పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య.. కుటుంబంలో విషాదం.

చండూరు: పత్తి పంట పూర్తిగా ఎండిపోవడంతో పెట్టుబడి నష్టం తప్పదన్న మనస్తాపంతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నల్గొండ జిల్లా చండూరు మండలంలో చోటుచేసుకుంది.

అంగడిపేటకు చెందిన పనస రాములు (55) సోమవారం తన పొలానికి వెళ్లాడు. పత్తి పంట ఎండిపోయి చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో పొలంలోనే పురుగుల మందు తాగాడు.

సాయంత్రం అయినా రాములు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

రైతు మృతితో అంగడిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చే దశలో పంట ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన రైతు ఈ నిర్ణయం తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News