420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి అర్హులైన ప్రజలకు ప్రభుత్వ ప్రయోజనాలు అందించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.న్యాల్కల్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో నరేష్బాబుకు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సున్నపు సత్యనారాయణ, ప్రవీణ్కుమార్, శివరాజ్, గొల్ల రాములు, మన్నెల్లి ప్రభు, హోతి మహేష్ మాట్లాడుతూ మహిళలు, రైతులు, రైతు కూలీలు, నిరుద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఆటో కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఎన్నికల హామీల మేరకు ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి