Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఆర్‌ ప్రక్రియకు ప్రజలు సహకరించాలి.. వై. పండరి విజ్ఞప్తి అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 07, 2026 07:58 PM

భూమయ్య సాహిత్య స్వర్ణోత్సవంపై జాతీయ సదస్సు.

భూమయ్య సాహిత్య స్వర్ణోత్సవంపై జాతీయ సదస్సు.

భూమయ్య సాహిత్య స్వర్ణోత్సవంపై జాతీయ సదస్సు.
07-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఈ నెల 26న నాగార్జున ప్రభుత్వ కళాశాలలో నిర్వహణ.. బ్రోచర్ ఆవిష్కరించిన ప్రిన్సిపాల్.

నల్లగొండ: ప్రముఖ సాహితీవేత్త ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్య ప్రస్థానాన్ని నేటి తరానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో జాతీయ సదస్సుకు నాగార్జున ప్రభుత్వ కళాశాల వేదిక కానుంది. తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 26న “ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్య స్వర్ణోత్సవం (1976–2026)” పేరుతో ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు.

సోమవారం కళాశాలలో ఇతర అధ్యాపకులతో కలిసి సదస్సు బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆచార్య అనుమాండ్ల భూమయ్య ఇప్పటివరకు 54 గ్రంథాలను రచించారని తెలిపారు. పద్యకవిగా, గేయకావ్యకర్తగా, విమర్శకునిగా భూమయ్య విశిష్ట గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆయన సాహిత్య విశిష్టతను, రచనా వైభవాన్ని నేటి తరానికి చేరువ చేయడమే సదస్సు ప్రధాన ఉద్దేశమన్నారు.

దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ఆచార్యులు, పరిశోధకులు, అధ్యాపకులు, భాషావేత్తలు, విమర్శకులు సదస్సులో పాల్గొని భూమయ్య సాహిత్యంపై వివిధ అంశాల్లో పరిశోధనా పత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. పరిశోధకులు, స్థానిక సాహితీవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని కోరారు.

కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్ డా. పరంగి రవికుమార్, డా. అంతటి శ్రీనివాసులు, తెలుగు శాఖ అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, విద్యాత్మిక సమన్వయకర్త బి. నాగరాజు, అధ్యాపకులు డా. వాస భూపాల్, డా. టంగుటూరి సైదులు, ఎస్. ప్రభాకర్, దండి అంజయ్య, లింగస్వామి, వనజ, శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భూమయ్య సాహిత్య స్వర్ణోత్సవంపై జాతీయ సదస్సు.

Article Image

ఈ నెల 26న నాగార్జున ప్రభుత్వ కళాశాలలో నిర్వహణ.. బ్రోచర్ ఆవిష్కరించిన ప్రిన్సిపాల్.

నల్లగొండ: ప్రముఖ సాహితీవేత్త ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్య ప్రస్థానాన్ని నేటి తరానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో జాతీయ సదస్సుకు నాగార్జున ప్రభుత్వ కళాశాల వేదిక కానుంది. తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 26న “ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్య స్వర్ణోత్సవం (1976–2026)” పేరుతో ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు.

సోమవారం కళాశాలలో ఇతర అధ్యాపకులతో కలిసి సదస్సు బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆచార్య అనుమాండ్ల భూమయ్య ఇప్పటివరకు 54 గ్రంథాలను రచించారని తెలిపారు. పద్యకవిగా, గేయకావ్యకర్తగా, విమర్శకునిగా భూమయ్య విశిష్ట గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆయన సాహిత్య విశిష్టతను, రచనా వైభవాన్ని నేటి తరానికి చేరువ చేయడమే సదస్సు ప్రధాన ఉద్దేశమన్నారు.

దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ఆచార్యులు, పరిశోధకులు, అధ్యాపకులు, భాషావేత్తలు, విమర్శకులు సదస్సులో పాల్గొని భూమయ్య సాహిత్యంపై వివిధ అంశాల్లో పరిశోధనా పత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. పరిశోధకులు, స్థానిక సాహితీవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని కోరారు.

కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్ డా. పరంగి రవికుమార్, డా. అంతటి శ్రీనివాసులు, తెలుగు శాఖ అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, విద్యాత్మిక సమన్వయకర్త బి. నాగరాజు, అధ్యాపకులు డా. వాస భూపాల్, డా. టంగుటూరి సైదులు, ఎస్. ప్రభాకర్, దండి అంజయ్య, లింగస్వామి, వనజ, శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News