Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలి అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 07, 2026 07:05 PM

టీటీడీ కళ్యాణ మండపం భూమిపై మ్యుటేషన్ చేయాలి

టీటీడీ కళ్యాణ మండపం భూమిపై మ్యుటేషన్ చేయాలి

టీటీడీ కళ్యాణ మండపం భూమిపై మ్యుటేషన్ చేయాలి
07-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల బీజేపీ నేతల డిమాండ్‌.. కలెక్టరేట్‌లో వినతిపత్రం.


నల్గొండ, సెప్టెంబర్‌ 7: చిట్యాల పట్టణ ప్రజల ఆకాంక్ష మేరకు టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి కేటాయించిన భూమిని అదే ఉద్దేశంతో టీటీడీ కళ్యాణ మండపం పేరుపై మ్యుటేషన్ చేయాలని చిట్యాల బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌ డే సందర్భంగా ఈ మేరకు అధికారులకు వినతిపత్రం అందజేశారు.

చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులోని సర్వే నంబర్‌ 649లో ఎకరం 12 గుంటల భూమిని టీటీడీ కళ్యాణ మండపం కోసం వినియోగించాలనే ఉద్దేశంతో పట్టణ ప్రజలు డబ్బులు సమకూర్చారని నాయకులు తెలిపారు. ప్రజలు ఏ లక్ష్యంతో భూమి కోసం సహకరించారో, అదే లక్ష్యంతో భూమిని టీటీడీ కళ్యాణ మండపం పేరుపై మ్యుటేషన్‌ చేయాలని కోరారు. ఈ విషయంలో అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని చిట్యాల పట్టణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సంత్‌ రవిదాస్‌ జయంతి ఉత్సవ కన్వీనర్‌ మాస శ్రీనివాస్‌, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్‌, జిల్లా కౌన్సిల్‌ మెంబర్‌ కూరెళ్ల శ్రీను, జిల్లా కార్యవర్గ సభ్యుడు జయారపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

టీటీడీ కళ్యాణ మండపం భూమిపై మ్యుటేషన్ చేయాలి

Article Image

చిట్యాల బీజేపీ నేతల డిమాండ్‌.. కలెక్టరేట్‌లో వినతిపత్రం.


నల్గొండ, సెప్టెంబర్‌ 7: చిట్యాల పట్టణ ప్రజల ఆకాంక్ష మేరకు టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి కేటాయించిన భూమిని అదే ఉద్దేశంతో టీటీడీ కళ్యాణ మండపం పేరుపై మ్యుటేషన్ చేయాలని చిట్యాల బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌ డే సందర్భంగా ఈ మేరకు అధికారులకు వినతిపత్రం అందజేశారు.

చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులోని సర్వే నంబర్‌ 649లో ఎకరం 12 గుంటల భూమిని టీటీడీ కళ్యాణ మండపం కోసం వినియోగించాలనే ఉద్దేశంతో పట్టణ ప్రజలు డబ్బులు సమకూర్చారని నాయకులు తెలిపారు. ప్రజలు ఏ లక్ష్యంతో భూమి కోసం సహకరించారో, అదే లక్ష్యంతో భూమిని టీటీడీ కళ్యాణ మండపం పేరుపై మ్యుటేషన్‌ చేయాలని కోరారు. ఈ విషయంలో అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని చిట్యాల పట్టణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సంత్‌ రవిదాస్‌ జయంతి ఉత్సవ కన్వీనర్‌ మాస శ్రీనివాస్‌, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్‌, జిల్లా కౌన్సిల్‌ మెంబర్‌ కూరెళ్ల శ్రీను, జిల్లా కార్యవర్గ సభ్యుడు జయారపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News