జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ ప్రత్యేక సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్ లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య చికిత్సలకు ఆర్థిక సహాయం అందిస్తూ బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తోందన్నారు. ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ వారి ప్రత్యేక చొరవతో నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా కలేరు రవి, రామావత్ సీతారాం, ర్యాకల రవీందర్ రెడ్డి, పార్శెట్టి సురేష్ కుమార్, తలారి మల్లయ్య, బిరాదార్ తనజీరావు, బర్మవత్ మమత, బుర్జుకాడి యాదుల్, సాగర్ సంజీవ్, విశ్లావత్ సుజాత బాయి, పట్లోల్ల విద్యావతి, రాథోడ్ లక్ష్మీ, అంగోత్ నరేష్, నాయకుని అనిత, బేగారి శోభా, ఉప్పరి సత్వ, మలకుమారి మల్లవ్వ, బర్డే స్వప్న, బాసడ వినోద్, గూడూరు బసమ్మ, గొల్ల సంగయ్య, మాస్టర్ రుద్రాంశ్, జానకంపల్లి రాజు, విశ్లావత్ మనూష్, పోగుల లక్ష్మీ, తెలుగు శోభా, ఈడిగి హేమలత, బాల్చుకూరి మవిత, మ్యాక్ శ్రీనివాస్ రెడ్డి, అదే మీరాబాయి, షేక్ అన్వర్ తదితర 31 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.11.12 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ ఆర్థిక సహాయం తమ వైద్య ఖర్చులకు ఎంతో ఉపయోగపడుతుందని లబ్ధిదారులు తెలిపారు. సీఎం సహాయ నిధి మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రి, ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్,మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
వైద్య చికిత్సకు ఆర్థిక చేయూత.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
వైద్య చికిత్సకు ఆర్థిక చేయూత.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
Krishna
జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ ప్రత్యేక సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్ లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య చికిత్సలకు ఆర్థిక సహాయం అందిస్తూ బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తోందన్నారు. ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ వారి ప్రత్యేక చొరవతో నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా కలేరు రవి, రామావత్ సీతారాం, ర్యాకల రవీందర్ రెడ్డి, పార్శెట్టి సురేష్ కుమార్, తలారి మల్లయ్య, బిరాదార్ తనజీరావు, బర్మవత్ మమత, బుర్జుకాడి యాదుల్, సాగర్ సంజీవ్, విశ్లావత్ సుజాత బాయి, పట్లోల్ల విద్యావతి, రాథోడ్ లక్ష్మీ, అంగోత్ నరేష్, నాయకుని అనిత, బేగారి శోభా, ఉప్పరి సత్వ, మలకుమారి మల్లవ్వ, బర్డే స్వప్న, బాసడ వినోద్, గూడూరు బసమ్మ, గొల్ల సంగయ్య, మాస్టర్ రుద్రాంశ్, జానకంపల్లి రాజు, విశ్లావత్ మనూష్, పోగుల లక్ష్మీ, తెలుగు శోభా, ఈడిగి హేమలత, బాల్చుకూరి మవిత, మ్యాక్ శ్రీనివాస్ రెడ్డి, అదే మీరాబాయి, షేక్ అన్వర్ తదితర 31 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.11.12 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ ఆర్థిక సహాయం తమ వైద్య ఖర్చులకు ఎంతో ఉపయోగపడుతుందని లబ్ధిదారులు తెలిపారు. సీఎం సహాయ నిధి మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రి, ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్,మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి