Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. హామీల అమలులో ఘోర వైఫల్యం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 08:31 PM

ఈఎంఐ కట్టలేదని... ఆటో డ్రైవర్ అదృశ్యం!

ఈఎంఐ కట్టలేదని... ఆటో డ్రైవర్ అదృశ్యం!

ఈఎంఐ కట్టలేదని... ఆటో డ్రైవర్ అదృశ్యం!
02-09-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

ఆటో కిరాయికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన ఓ వ్యక్తి తిరిగి రాని ఘటన మండల పరిధిలోని కుంట్లగూడెంలో చోటుచేసుకుంది. చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కుంట్లగూడెం గ్రామానికి చెందిన గువ్వల నరసింహ (42) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల ఆటో ఈఎంఐ (ఫైనాన్స్ వాయిదా) చెల్లించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.​ఈ క్రమంలో ఈ నెల 1న ఉదయం 11 గంటల సమయంలో ఆటో కిరాయికి వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో బాధితుడి భార్య శశికళ బుధవారం చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ​బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. అదృశ్యమైన నరసింహ ఐదు అడుగుల ఎత్తు, తెల్లని రంగు కలిగి ఉంటాడని, ఇటువంటి ఆచూకీ తెలిస్తే చౌటుప్పల్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Sthanikam

ఈఎంఐ కట్టలేదని... ఆటో డ్రైవర్ అదృశ్యం!

Article Image

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

ఆటో కిరాయికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన ఓ వ్యక్తి తిరిగి రాని ఘటన మండల పరిధిలోని కుంట్లగూడెంలో చోటుచేసుకుంది. చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కుంట్లగూడెం గ్రామానికి చెందిన గువ్వల నరసింహ (42) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల ఆటో ఈఎంఐ (ఫైనాన్స్ వాయిదా) చెల్లించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.​ఈ క్రమంలో ఈ నెల 1న ఉదయం 11 గంటల సమయంలో ఆటో కిరాయికి వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో బాధితుడి భార్య శశికళ బుధవారం చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ​బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. అదృశ్యమైన నరసింహ ఐదు అడుగుల ఎత్తు, తెల్లని రంగు కలిగి ఉంటాడని, ఇటువంటి ఆచూకీ తెలిస్తే చౌటుప్పల్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News