Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమమే లక్ష్యం ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 03:24 PM

కేసీఆర్‌ పనులకు రిబ్బన్‌ కట్‌ చేయడమేనా?

కేసీఆర్‌ పనులకు రిబ్బన్‌ కట్‌ చేయడమేనా?

కేసీఆర్‌ పనులకు రిబ్బన్‌ కట్‌ చేయడమేనా?
02-09-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


నకిరేకల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి కొత్తగా ఏం ఇచ్చారో చెప్పాలి: చిరుమర్తి లింగయ్య.


నకిరేకల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలనకు వ్యతిరేకంగా బుధవారం నకిరేకల్‌ నియోజకవర్గ కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ నిరసన, ధర్నా నిర్వహించాయి. ఆరు గ్యారంటీల వైఫల్యం, ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల అమలు తీరును ప్రశ్నిస్తూ 420 అడుగుల ఫ్లెక్సీ, 1000 రోజుల బాకీ కార్డులను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా లింగయ్య మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ నాయకత్వంలో మంజూరైన పనులను కొనసాగించి ప్రారంభించడం తప్ప కాంగ్రెస్‌ ప్రభుత్వం నకిరేకల్‌కు కొత్తగా చేసిందేమిటని ప్రశ్నించారు.

ముఖ్యంగా 100 పడకల ఆసుపత్రి బీఆర్‌ఎస్‌ హయాంలోనే మంజూరైందని, దానికి రిబ్బన్‌ కట్‌ చేయడం కాకుండా నకిరేకల్‌కు కొత్తగా ఏం ఇచ్చారో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, పేదలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డితో పాటు నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

కేసీఆర్‌ పనులకు రిబ్బన్‌ కట్‌ చేయడమేనా?

Article Image


నకిరేకల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి కొత్తగా ఏం ఇచ్చారో చెప్పాలి: చిరుమర్తి లింగయ్య.


నకిరేకల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలనకు వ్యతిరేకంగా బుధవారం నకిరేకల్‌ నియోజకవర్గ కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ నిరసన, ధర్నా నిర్వహించాయి. ఆరు గ్యారంటీల వైఫల్యం, ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల అమలు తీరును ప్రశ్నిస్తూ 420 అడుగుల ఫ్లెక్సీ, 1000 రోజుల బాకీ కార్డులను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా లింగయ్య మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ నాయకత్వంలో మంజూరైన పనులను కొనసాగించి ప్రారంభించడం తప్ప కాంగ్రెస్‌ ప్రభుత్వం నకిరేకల్‌కు కొత్తగా చేసిందేమిటని ప్రశ్నించారు.

ముఖ్యంగా 100 పడకల ఆసుపత్రి బీఆర్‌ఎస్‌ హయాంలోనే మంజూరైందని, దానికి రిబ్బన్‌ కట్‌ చేయడం కాకుండా నకిరేకల్‌కు కొత్తగా ఏం ఇచ్చారో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, పేదలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డితో పాటు నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News