Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హైదరాబాద్‌లో డిఫెన్స్‌ ఎక్స్‌పో–2026.. రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 02:34 PM

శివలాల్ మహారాజ్ దీక్షలకు ఆహ్వానం.. అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు

శివలాల్ మహారాజ్ దీక్షలకు ఆహ్వానం.. అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు

శివలాల్ మహారాజ్ దీక్షలకు ఆహ్వానం.. అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు
02-09-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని ముకుంద నాయక్ తండాలో శివలాల్ మహారాజ్ దీక్ష కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోవింద్ మహారాజ్, పూజారి బిక్కు నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 41 రోజుల దీక్ష సెప్టెంబర్ 5, 2026న ప్రారంభం కానుండగా, పోరాదేవి శేఖర్ మహారాజ్ చేతుల మీదుగా భక్తులు దీక్ష స్వీకరించనున్నారు. అలాగే 21 రోజుల దీక్ష సెప్టెంబర్ 25న ప్రారంభం కానుంది. దీక్ష విరమణ కార్యక్రమాన్ని అక్టోబర్ 15న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీక్షలో పాల్గొనే భక్తులు నియమ నిష్ఠలను పాటిస్తూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని ఆరాధించాలని కోరారు. ఈ కార్యక్రమానికి కంగ్టి మండలంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, శివలాల్ మహారాజ్‌పై విశ్వాసంతో దీక్ష తీసుకునే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గోవింద్ మహారాజ్, పూజారి బిక్కు నాయక్ కోరారు.

Sthanikam

శివలాల్ మహారాజ్ దీక్షలకు ఆహ్వానం.. అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని ముకుంద నాయక్ తండాలో శివలాల్ మహారాజ్ దీక్ష కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోవింద్ మహారాజ్, పూజారి బిక్కు నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 41 రోజుల దీక్ష సెప్టెంబర్ 5, 2026న ప్రారంభం కానుండగా, పోరాదేవి శేఖర్ మహారాజ్ చేతుల మీదుగా భక్తులు దీక్ష స్వీకరించనున్నారు. అలాగే 21 రోజుల దీక్ష సెప్టెంబర్ 25న ప్రారంభం కానుంది. దీక్ష విరమణ కార్యక్రమాన్ని అక్టోబర్ 15న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీక్షలో పాల్గొనే భక్తులు నియమ నిష్ఠలను పాటిస్తూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని ఆరాధించాలని కోరారు. ఈ కార్యక్రమానికి కంగ్టి మండలంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, శివలాల్ మహారాజ్‌పై విశ్వాసంతో దీక్ష తీసుకునే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గోవింద్ మహారాజ్, పూజారి బిక్కు నాయక్ కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News