Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ సమరభేరి ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:38 PM

కాంగ్రెస్ భౌతిక దాడులపై ‘కమలం’ నిరసనలు!

కాంగ్రెస్ భౌతిక దాడులపై ‘కమలం’ నిరసనలు!

కాంగ్రెస్ భౌతిక దాడులపై ‘కమలం’ నిరసనలు!
01-09-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

బిజెపి నేతల ఆగ్రహం... కాంగ్రెస్ తీరుపై నిరసన జ్వాలలు

నల్గొండలోని బిజెపి జిల్లా కార్యాలయంపై, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ నాయకులు జరిపిన దాడులను నిరసిస్తూ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వలిగొండ చౌరస్తాలో బిజెపి శ్రేణులు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.​ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, సీనియర్ నేతలు మాట్లాడుతూ... బిజెపి ఆఫీసుపై రాళ్లు రువ్వి ఫర్నిచర్ ధ్వంసం చేయడమే కాకుండా, జిల్లా అధ్యక్షుడి ఇంట్లోకి చొరబడి ఆయన తల్లి, మామయ్యపై భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇంట్లోని టీవీ, ఫ్రిజ్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలపై కాంగ్రెస్ శ్రేణులు రౌడీయిజానికి పాల్పడుతున్నాయని, ఇలాగే ప్రవర్తిస్తే ప్రజలే తిరగబడి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ​ఈ నిరసన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల బిక్షం గౌడ్, మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పనా యాదవ్, సీనియర్ నాయకులు రమణగోని శంకరయ్య, ముత్యాల భూపాల్ రెడ్డి, ఉబ్బు బిక్షపతి, బాతరాజు సత్యం, పోలోజు శ్రీధర్ బాబు, కౌన్సిలర్లు బుడ్డ సురేష్, పోలపల్లి లక్ష్మీ ముత్తయ్య, నాయకులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, ఉడుగు యాదయ్య గౌడ్, కాసుల వెంకటేశం, ఆలే చిరంజీవి, దిండు భాస్కర్, పబ్బు వంశీ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ భౌతిక దాడులపై ‘కమలం’ నిరసనలు!

Article Image

చౌటుప్పల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

బిజెపి నేతల ఆగ్రహం... కాంగ్రెస్ తీరుపై నిరసన జ్వాలలు

నల్గొండలోని బిజెపి జిల్లా కార్యాలయంపై, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ నాయకులు జరిపిన దాడులను నిరసిస్తూ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వలిగొండ చౌరస్తాలో బిజెపి శ్రేణులు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.​ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, సీనియర్ నేతలు మాట్లాడుతూ... బిజెపి ఆఫీసుపై రాళ్లు రువ్వి ఫర్నిచర్ ధ్వంసం చేయడమే కాకుండా, జిల్లా అధ్యక్షుడి ఇంట్లోకి చొరబడి ఆయన తల్లి, మామయ్యపై భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇంట్లోని టీవీ, ఫ్రిజ్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలపై కాంగ్రెస్ శ్రేణులు రౌడీయిజానికి పాల్పడుతున్నాయని, ఇలాగే ప్రవర్తిస్తే ప్రజలే తిరగబడి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ​ఈ నిరసన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల బిక్షం గౌడ్, మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పనా యాదవ్, సీనియర్ నాయకులు రమణగోని శంకరయ్య, ముత్యాల భూపాల్ రెడ్డి, ఉబ్బు బిక్షపతి, బాతరాజు సత్యం, పోలోజు శ్రీధర్ బాబు, కౌన్సిలర్లు బుడ్డ సురేష్, పోలపల్లి లక్ష్మీ ముత్తయ్య, నాయకులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, ఉడుగు యాదయ్య గౌడ్, కాసుల వెంకటేశం, ఆలే చిరంజీవి, దిండు భాస్కర్, పబ్బు వంశీ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News