ఖబర్దార్ కాంగ్రెస్ గూండాల్లారా: శాగ చంద్రశేఖర్ రెడ్డి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడటం తీవ్ర అహంకారానికి, అరాచక రాజకీయాలకు పరాకాష్ట అని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శాగ చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక భౌతిక దాడులకు దిగడం కాంగ్రెస్ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అధికారం ఉందని విర్రవీగొద్దు.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి” అని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు రౌడీల మాదిరిగా ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. “ఇది మీకు హెచ్చరిక కాదు.. తుది హెచ్చరిక. బీజేపీ జోలికి వస్తే ప్రజాస్వామ్య పద్ధతిలోనే గట్టిగా బుద్ధి చెబుతాం. ఖబర్దార్ కాంగ్రెస్ గూండాల్లారా.. బెదిరించాలని చూస్తే మీకే ఎదురుదెబ్బ తప్పదు” అని స్పష్టం చేశారు.చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్ని భౌతిక దాడులు చేసినా ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం ఆపేది లేదని తేల్చిచెప్పారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి