రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా ప్రత్యేక క్షణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను గుఱ్ఱపు సౌమ్య మచ్చేందర్ కలిసి రాఖీ కట్టి హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల కోసం కేటీఆర్ నిరంతరం చేస్తున్న సేవలను గుర్తుచేసుకుంటూ ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేయడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని గుఱ్ఱపు సౌమ్య మచ్చేందర్ తెలిపారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని, ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ కలయిక ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్, జీఎంఆర్ టీమ్ నారాయణఖేడ్ సభ్యులు పాల్గొన్నారు.
కేటీఆర్కు రాఖీ.. ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపిన సౌమ్య మచ్చేందర్
కేటీఆర్కు రాఖీ.. ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపిన సౌమ్య మచ్చేందర్
Krishna
రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా ప్రత్యేక క్షణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను గుఱ్ఱపు సౌమ్య మచ్చేందర్ కలిసి రాఖీ కట్టి హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల కోసం కేటీఆర్ నిరంతరం చేస్తున్న సేవలను గుర్తుచేసుకుంటూ ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేయడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని గుఱ్ఱపు సౌమ్య మచ్చేందర్ తెలిపారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని, ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ కలయిక ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్, జీఎంఆర్ టీమ్ నారాయణఖేడ్ సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి