కేతేపల్లి జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు.. పలువురికి తీవ్ర గాయాలు.
కేతేపల్లి: నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కేతేపల్లి మండలంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట–హైదరాబాద్ జాతీయ రహదారి ఎన్హెచ్-365పై జ్యోతి ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
సూర్యాపేట నుంచి నకిరేకల్ వైపు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొట్టడంతో ఆటో అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ గరుడ బస్సు ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి డివైడర్పైకి ఎక్కింది. దీంతో ప్రయాణికుల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ప్రమాదంలో గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న కేతేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి