Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 01:58 PM

50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి.

50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి.

50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి.
31-08-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


నాయి బ్రాహ్మణ క్షవరవృత్తి కార్మికుల ప్రజావాణిలో వినతి.


చిట్యాల:

తరతరాలుగా క్షవరవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న నాయి బ్రాహ్మణ క్షవరవృత్తి కార్మికులకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం చిట్యాల పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం చిట్యాల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేనేత, గీత కార్మికులకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ అందిస్తున్న మాదిరిగానే నాయి బ్రాహ్మణ క్షవరవృత్తి కార్మికులకు కూడా అదే వయసులో పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. క్షవరవృత్తి చేయడం వల్ల 40 ఏళ్లకే కంటి చూపు తగ్గడం, శారీరక సమస్యలు ఎదురవడం వంటి ఇబ్బందులతో పలువురు వృత్తిని కొనసాగించలేక కుటుంబాలను పోషించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం నాయి బ్రాహ్మణులు అనేక పోరాటాల్లో పాల్గొన్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాలు, తమ పిల్లల భవిష్యత్తు మెరుగుపడుతుందని ఆశించామని తెలిపారు. అయితే ప్రస్తుతం కనీసం పింఛన్ కూడా పొందలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.నాయి బ్రాహ్మణ క్షవరవృత్తి కార్మికుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు

నాయి బ్రాహ్మణ సేవా సంఘం చిట్యాల పట్టణ అధ్యక్షుడు అమరోజు వెంకటేశం నాయి, ప్రధాన కార్యదర్శి అమరోజు శ్రీరాములు నాయి తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి.

Article Image


నాయి బ్రాహ్మణ క్షవరవృత్తి కార్మికుల ప్రజావాణిలో వినతి.


చిట్యాల:

తరతరాలుగా క్షవరవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న నాయి బ్రాహ్మణ క్షవరవృత్తి కార్మికులకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం చిట్యాల పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం చిట్యాల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేనేత, గీత కార్మికులకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ అందిస్తున్న మాదిరిగానే నాయి బ్రాహ్మణ క్షవరవృత్తి కార్మికులకు కూడా అదే వయసులో పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. క్షవరవృత్తి చేయడం వల్ల 40 ఏళ్లకే కంటి చూపు తగ్గడం, శారీరక సమస్యలు ఎదురవడం వంటి ఇబ్బందులతో పలువురు వృత్తిని కొనసాగించలేక కుటుంబాలను పోషించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం నాయి బ్రాహ్మణులు అనేక పోరాటాల్లో పాల్గొన్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాలు, తమ పిల్లల భవిష్యత్తు మెరుగుపడుతుందని ఆశించామని తెలిపారు. అయితే ప్రస్తుతం కనీసం పింఛన్ కూడా పొందలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.నాయి బ్రాహ్మణ క్షవరవృత్తి కార్మికుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు

నాయి బ్రాహ్మణ సేవా సంఘం చిట్యాల పట్టణ అధ్యక్షుడు అమరోజు వెంకటేశం నాయి, ప్రధాన కార్యదర్శి అమరోజు శ్రీరాములు నాయి తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News