Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అనిల్ గోండాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 07:30 PM

దేవాదాయ కార్యాలయంలో మద్యం బాటిల్.. గుట్కా ప్యాకెట్లు!

దేవాదాయ కార్యాలయంలో మద్యం బాటిల్.. గుట్కా ప్యాకెట్లు!

దేవాదాయ కార్యాలయంలో మద్యం బాటిల్.. గుట్కా ప్యాకెట్లు!
30-08-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయ కార్యాలయంలో దృశ్యాలపై భక్తుల ఆందోళన.. సమగ్ర విచారణకు డిమాండ్.


సూర్యాపేట: ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయానికి సంబంధించిన దేవాదాయ కార్యాలయంలో కనిపించిన కొన్ని దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. కార్యాలయం వెలుపల దేవాలయ, ధర్మాదాయ కార్యాలయం అని బోర్డు ఉండగా.. లోపల మద్యం బాటిల్, గుట్కా ప్యాకెట్లు, బట్టలు, వ్యక్తిగత సామగ్రి కనిపించడం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఎవరి అనుమతితో?


ఈఓ, చైర్మన్ వంటి బాధ్యతాయుత అధికారులు ఉపయోగించే గది, కుర్చీలు ఇతరుల వినియోగంలోకి ఎలా వచ్చాయి? ఆ గదిని ఎవరు కేటాయించారు? ప్రస్తుతం అక్కడ ఎవరు ఉంటున్నారు? వారికి అధికారిక అనుమతి ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్యాలయంలోని సామగ్రి, రికార్డుల భద్రతపై కూడా భక్తులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.


ఈఓ పర్యవేక్షణ ఎక్కడ?


భక్తులు సమకూర్చిన బీరువాల్లో ఆలయానికి సంబంధించిన కీలక రికార్డులు, పత్రాలు ఉంటే వాటి భద్రతకు బాధ్యత ఎవరిది? కార్యాలయాన్ని ఇతరుల వినియోగానికి అనుమతిస్తే నిబంధనలు ఏమిటి? మద్యం బాటిల్, గుట్కా ప్యాకెట్లు అక్కడికి ఎలా వచ్చాయన్న దానిపై అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.

ప్రముఖ పుణ్యక్షేత్రానికి చెందిన అధికారిక కార్యాలయంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సమగ్రంగా విచారించి వాస్తవాలను వెల్లడించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

దేవాదాయ కార్యాలయంలో మద్యం బాటిల్.. గుట్కా ప్యాకెట్లు!

Article Image

నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయ కార్యాలయంలో దృశ్యాలపై భక్తుల ఆందోళన.. సమగ్ర విచారణకు డిమాండ్.


సూర్యాపేట: ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయానికి సంబంధించిన దేవాదాయ కార్యాలయంలో కనిపించిన కొన్ని దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. కార్యాలయం వెలుపల దేవాలయ, ధర్మాదాయ కార్యాలయం అని బోర్డు ఉండగా.. లోపల మద్యం బాటిల్, గుట్కా ప్యాకెట్లు, బట్టలు, వ్యక్తిగత సామగ్రి కనిపించడం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఎవరి అనుమతితో?


ఈఓ, చైర్మన్ వంటి బాధ్యతాయుత అధికారులు ఉపయోగించే గది, కుర్చీలు ఇతరుల వినియోగంలోకి ఎలా వచ్చాయి? ఆ గదిని ఎవరు కేటాయించారు? ప్రస్తుతం అక్కడ ఎవరు ఉంటున్నారు? వారికి అధికారిక అనుమతి ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్యాలయంలోని సామగ్రి, రికార్డుల భద్రతపై కూడా భక్తులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.


ఈఓ పర్యవేక్షణ ఎక్కడ?


భక్తులు సమకూర్చిన బీరువాల్లో ఆలయానికి సంబంధించిన కీలక రికార్డులు, పత్రాలు ఉంటే వాటి భద్రతకు బాధ్యత ఎవరిది? కార్యాలయాన్ని ఇతరుల వినియోగానికి అనుమతిస్తే నిబంధనలు ఏమిటి? మద్యం బాటిల్, గుట్కా ప్యాకెట్లు అక్కడికి ఎలా వచ్చాయన్న దానిపై అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.

ప్రముఖ పుణ్యక్షేత్రానికి చెందిన అధికారిక కార్యాలయంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సమగ్రంగా విచారించి వాస్తవాలను వెల్లడించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News