నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయ కార్యాలయంలో దృశ్యాలపై భక్తుల ఆందోళన.. సమగ్ర విచారణకు డిమాండ్.
సూర్యాపేట: ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయానికి సంబంధించిన దేవాదాయ కార్యాలయంలో కనిపించిన కొన్ని దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. కార్యాలయం వెలుపల దేవాలయ, ధర్మాదాయ కార్యాలయం అని బోర్డు ఉండగా.. లోపల మద్యం బాటిల్, గుట్కా ప్యాకెట్లు, బట్టలు, వ్యక్తిగత సామగ్రి కనిపించడం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరి అనుమతితో?
ఈఓ, చైర్మన్ వంటి బాధ్యతాయుత అధికారులు ఉపయోగించే గది, కుర్చీలు ఇతరుల వినియోగంలోకి ఎలా వచ్చాయి? ఆ గదిని ఎవరు కేటాయించారు? ప్రస్తుతం అక్కడ ఎవరు ఉంటున్నారు? వారికి అధికారిక అనుమతి ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్యాలయంలోని సామగ్రి, రికార్డుల భద్రతపై కూడా భక్తులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈఓ పర్యవేక్షణ ఎక్కడ?
భక్తులు సమకూర్చిన బీరువాల్లో ఆలయానికి సంబంధించిన కీలక రికార్డులు, పత్రాలు ఉంటే వాటి భద్రతకు బాధ్యత ఎవరిది? కార్యాలయాన్ని ఇతరుల వినియోగానికి అనుమతిస్తే నిబంధనలు ఏమిటి? మద్యం బాటిల్, గుట్కా ప్యాకెట్లు అక్కడికి ఎలా వచ్చాయన్న దానిపై అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రానికి చెందిన అధికారిక కార్యాలయంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సమగ్రంగా విచారించి వాస్తవాలను వెల్లడించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి