మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన లబ్ధిదారుల నుంచి ‘చేయూత’ పింఛన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని అర్హులైన ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఒంటరి మహిళలు,వితంతువులు, వికలాంగులు,చేనేత కార్మికులు, గీత కార్మికులు, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 31, 2026 లోగా తమ దరఖాస్తులను సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.ఒంటరి మహిళ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే లబ్ధిదారుల వద్ద డివోర్స్ సర్టిఫికెట్ (విడాకుల పత్రం) లేని పక్షంలో, వారు చౌటుప్పల్ తహసీల్దార్ కార్యాలయం నుంచి సంబంధిత ధృవీకరణ పత్రం పొంది దరఖాస్తుకు జత చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి