గీత దాటిన వారిపై వెంటనే వేటు వేయాలి...
ఉచితాలు తగ్గించి.. ఉద్యమకారులకు న్యాయం చేయాలి...
మీడియా చిట్చాట్లో మాట్లాడిన సుఖేందర్రెడ్డి...
నల్లగొండ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నడుచుకోవాల్సిన తీరుపై తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నల్లగొండలో విలేకరులతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ.. పార్టీలో క్రమశిక్షణే పరమావధిగా ఉండాలని, గీత దాటి వ్యవహరించే వారిపై క్షణమైనా ఆలస్యం చేయకుండా వెంటనే వేటు వేయాలని స్పష్టం చేశారు. లేకపోతే పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని హెచ్చరించారు.
క్యాబినెట్లో మార్పులు అవసరం...
ప్రభుత్వ పనితీరు మరింత మెరుగుపడటానికి క్యాబినెట్లో, పాలనా వ్యవస్థలో తగిన మార్పులు చేర్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని గుత్తా అభిప్రాయపడ్డారు. పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలకు తక్షణమే స్వస్తి చెప్పాలని, స్థానిక క్యాడర్లో నెలకొన్న అసంతృప్తిని సమతుల్యం (బ్యాలెన్స్) చేస్తూ ముందుకెళ్లాలని సూచించారు.
ఉచితాలు తగ్గించాలి పెన్షన్లు పెంచాలి...
ప్రజా సంక్షేమంపై మాట్లాడుతూ.. ఉచిత పథకాల మోజు తగ్గించి, నిజమైన లబ్ధిదారులకు మేలు జరిగేలా చూడాలని సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు రైతులకు ఇచ్చే రైతు భరోసా పథకాన్ని ఎలాంటి విఘాతం లేకుండా కొనసాగించాలి ప్రస్తుతం ఇస్తున్న సామాజిక పింఛన్లను రూ.4,000లకు పెంచాలి. నిషేధిత భూముల జాబితా అయిన ‘22A’ను వెంటనే రద్దు చేసి భూ సమస్యలకు పరిష్కారం చూపాలి. తెలంగాణ సిద్ధాంతకర్తలు, ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం ఇచ్చి న్యాయం చేయాలని ఆయన పేర్కొన్నారు. వీటన్నింటినీ సమర్థవంతంగా అమలు చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం సాధ్యమవుతుందని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి