తోబుట్టువులకు రాఖీలు కట్టిన సోదరీమణులు
స్థానికం పత్రిక సబ్ ఎడిటర్ కత్తుల రవి కి రాఖీ కట్టిన అక్క సువర్ణ
చౌటుప్పల్ పట్టణంలో శుక్రవారం రాఖీ పౌర్ణమి వేడుకలను ప్రజలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. అక్కాచెల్లెళ్లు తమ సోదరుల ఆయురారోగ్యాలు, శ్రేయస్సును కాంక్షిస్తూ అనురాగానికి ప్రతీకగా రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడగా, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్థానికం పత్రిక సబ్ ఎడిటర్, అంజలి ఫోటో స్టూడియో అధినేత రవికి ఆయన అక్క సువర్ణ రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి, ఆత్మీయ అనురాగాలకు ప్రతీక రాఖీ పండుగ అని పేర్కొన్నారు. పట్టణమంతా పండగ వాతావరణం నెలకొంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి