Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెట్లు నాటమంటున్న ప్రభుత్వం.. నరికేస్తున్న యంత్రాంగం! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:58 PM

20 కిలోల గంజాయి పట్టివేత: ఇద్దరి అరెస్ట్

20 కిలోల గంజాయి పట్టివేత: ఇద్దరి అరెస్ట్

20 కిలోల గంజాయి పట్టివేత: ఇద్దరి అరెస్ట్
28-08-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఒడిశా నుంచి అక్రమ రవాణా

ఫ్రాంక్స్ కారు, 3 మొబైల్ ఫోన్లు సీజ్

జాతీయ రహదారి పై చౌటుప్పల్ ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్ వద్ద పోలీసులు గురువారం జరిపిన వాహనాల తనిఖీల్లో 20.360 కిలోల గంజాయి పట్టుబడింది. అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

​చౌటుప్పల్ డి.ఎస్.పి. మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్, ఈగల్ ఫోర్స్ సహకారంతో ఎస్‌ఐ ఎస్. కృష్ణమాల్ తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారంతో అనుమానాస్పదంగా వచ్చిన ఒడిశా రిజిస్ట్రేషన్ (OD02DS897) గల ఫ్రాంక్స్ కారును తనిఖీ చేయగా, డిక్కీలో బ్రౌన్ టేపుతో చుట్టిన 20 ప్యాకెట్లలో 20.360 కిలోల గంజాయి లభించింది. దీంతో గంజాయితో పాటు కారు, 3 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.​ఈ కేసులో ఒడిశాలోని కేంద్రపారా జిల్లా రాజ్‌నగర్‌కు చెందిన త్రిలోచన్ సామంత్రా (30), సాగర్‌బాల్ (23)లను అరెస్ట్ చేశారు. ఒడిశాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి తెలంగాణలో అధిక ధరకు విక్రయించేందుకు, రూ.50,000 కమిషన్ ఆశతో వీరు రవాణా చేస్తున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఈ అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్న మిగతా నిందితులపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని, అరెస్ట్ చేసిన ఇద్దరిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Sthanikam

20 కిలోల గంజాయి పట్టివేత: ఇద్దరి అరెస్ట్

Article Image

ఒడిశా నుంచి అక్రమ రవాణా

ఫ్రాంక్స్ కారు, 3 మొబైల్ ఫోన్లు సీజ్

జాతీయ రహదారి పై చౌటుప్పల్ ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్ వద్ద పోలీసులు గురువారం జరిపిన వాహనాల తనిఖీల్లో 20.360 కిలోల గంజాయి పట్టుబడింది. అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

​చౌటుప్పల్ డి.ఎస్.పి. మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్, ఈగల్ ఫోర్స్ సహకారంతో ఎస్‌ఐ ఎస్. కృష్ణమాల్ తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారంతో అనుమానాస్పదంగా వచ్చిన ఒడిశా రిజిస్ట్రేషన్ (OD02DS897) గల ఫ్రాంక్స్ కారును తనిఖీ చేయగా, డిక్కీలో బ్రౌన్ టేపుతో చుట్టిన 20 ప్యాకెట్లలో 20.360 కిలోల గంజాయి లభించింది. దీంతో గంజాయితో పాటు కారు, 3 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.​ఈ కేసులో ఒడిశాలోని కేంద్రపారా జిల్లా రాజ్‌నగర్‌కు చెందిన త్రిలోచన్ సామంత్రా (30), సాగర్‌బాల్ (23)లను అరెస్ట్ చేశారు. ఒడిశాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి తెలంగాణలో అధిక ధరకు విక్రయించేందుకు, రూ.50,000 కమిషన్ ఆశతో వీరు రవాణా చేస్తున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఈ అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్న మిగతా నిందితులపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని, అరెస్ట్ చేసిన ఇద్దరిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News