ఒడిశా నుంచి అక్రమ రవాణా
ఫ్రాంక్స్ కారు, 3 మొబైల్ ఫోన్లు సీజ్
జాతీయ రహదారి పై చౌటుప్పల్ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ వద్ద పోలీసులు గురువారం జరిపిన వాహనాల తనిఖీల్లో 20.360 కిలోల గంజాయి పట్టుబడింది. అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చౌటుప్పల్ డి.ఎస్.పి. మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్, ఈగల్ ఫోర్స్ సహకారంతో ఎస్ఐ ఎస్. కృష్ణమాల్ తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారంతో అనుమానాస్పదంగా వచ్చిన ఒడిశా రిజిస్ట్రేషన్ (OD02DS897) గల ఫ్రాంక్స్ కారును తనిఖీ చేయగా, డిక్కీలో బ్రౌన్ టేపుతో చుట్టిన 20 ప్యాకెట్లలో 20.360 కిలోల గంజాయి లభించింది. దీంతో గంజాయితో పాటు కారు, 3 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో ఒడిశాలోని కేంద్రపారా జిల్లా రాజ్నగర్కు చెందిన త్రిలోచన్ సామంత్రా (30), సాగర్బాల్ (23)లను అరెస్ట్ చేశారు. ఒడిశాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి తెలంగాణలో అధిక ధరకు విక్రయించేందుకు, రూ.50,000 కమిషన్ ఆశతో వీరు రవాణా చేస్తున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఈ అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్న మిగతా నిందితులపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని, అరెస్ట్ చేసిన ఇద్దరిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి