Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెట్లు నాటమంటున్న ప్రభుత్వం.. నరికేస్తున్న యంత్రాంగం! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:01 PM

సంగారెడ్డి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఘనంగా రాఖీ వేడుకలు

సంగారెడ్డి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఘనంగా రాఖీ వేడుకలు

సంగారెడ్డి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఘనంగా రాఖీ వేడుకలు
28-08-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లా కేంద్రంలోని సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్‌ఐ మధుసూదన్ రెడ్డి, ఎస్‌ఐ హారిక సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు పోలీసులకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీకగా నిలుస్తుందని, సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ముఖ్యమని తెలిపారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. రాఖీలు కట్టిన మహిళలు, విద్యార్థినులకు పోలీసు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్–ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా ఈ రాఖీ వేడుకలు ఆప్యాయంగా సాగాయి.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్, నర్సింగ్, కానిస్టేబుల్ అబ్రహం, సాయిరామ్, గీత, సువర్ణ,సరళాదేవి పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Sthanikam

సంగారెడ్డి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఘనంగా రాఖీ వేడుకలు

Article Image

జిల్లా కేంద్రంలోని సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్‌ఐ మధుసూదన్ రెడ్డి, ఎస్‌ఐ హారిక సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు పోలీసులకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీకగా నిలుస్తుందని, సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ముఖ్యమని తెలిపారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. రాఖీలు కట్టిన మహిళలు, విద్యార్థినులకు పోలీసు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్–ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా ఈ రాఖీ వేడుకలు ఆప్యాయంగా సాగాయి.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్, నర్సింగ్, కానిస్టేబుల్ అబ్రహం, సాయిరామ్, గీత, సువర్ణ,సరళాదేవి పోలీస్ సిబ్బంది ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News