జిల్లా కేంద్రంలోని సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, ఎస్ఐ హారిక సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు పోలీసులకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీకగా నిలుస్తుందని, సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ముఖ్యమని తెలిపారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. రాఖీలు కట్టిన మహిళలు, విద్యార్థినులకు పోలీసు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్–ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా ఈ రాఖీ వేడుకలు ఆప్యాయంగా సాగాయి.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్, నర్సింగ్, కానిస్టేబుల్ అబ్రహం, సాయిరామ్, గీత, సువర్ణ,సరళాదేవి పోలీస్ సిబ్బంది ఉన్నారు.
సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఘనంగా రాఖీ వేడుకలు
సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఘనంగా రాఖీ వేడుకలు
Krishna
జిల్లా కేంద్రంలోని సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, ఎస్ఐ హారిక సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు పోలీసులకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీకగా నిలుస్తుందని, సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ముఖ్యమని తెలిపారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. రాఖీలు కట్టిన మహిళలు, విద్యార్థినులకు పోలీసు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్–ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా ఈ రాఖీ వేడుకలు ఆప్యాయంగా సాగాయి.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్, నర్సింగ్, కానిస్టేబుల్ అబ్రహం, సాయిరామ్, గీత, సువర్ణ,సరళాదేవి పోలీస్ సిబ్బంది ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి