చేయూత సామాజిక భద్రత పింఛన్ల పథకం–2026 కింద కొత్తగా పెన్షన్లు పొందేందుకు అర్హులైన వారు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ పాండు కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో పథకానికి సంబంధించిన పోస్టర్, బ్యానర్, కరపత్రాలను జిల్లా పరిషత్ సీఈఓ జానకిరెడ్డి, డీఆర్డీఏ అదనపు పీడీ సూర్యారావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హీమోఫీలియా బాధితులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, గ్రేడ్–2, గ్రేడ్–3 పైలేరియా బాధితులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దివ్యాంగులకు కనీసం 40 శాతం వైకల్యం ఉండి సదరం లేదా యూడీఐడీ ధృవీకరణ అవసరమన్నారు. వితంతువులు 18 సంవత్సరాలు పైబడి, భర్త మరణ ధృవీకరణ పత్రం కలిగి ఉండాలని, ఒంటరి మహిళలు 18 సంవత్సరాలు పైబడి భర్తతో విడిపోయి లేదా వదిలివేయబడి కనీసం ఏడాది పూర్తయి ఉండాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 30 సంవత్సరాలు, పట్టణ ప్రాంతాల్లో 35 సంవత్సరాలు పైబడిన అవివాహిత మహిళలు కూడా అర్హులన్నారు. కల్లుగీత, చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు పైబడి సంబంధిత శాఖల ధృవీకరణ ఉండాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు, పురపాలక కమిషనర్లు దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పారు. అలాగే చేయూత అధికారిక వెబ్సైట్లోని ‘చేయూత దరఖాస్తు ఫారాలు’ ద్వారా ఫారాలను పొందవచ్చన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనం అందేలా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్, అర్హులైన వారు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు.. 31లోగా దరఖాస్తు చేసుకోవాలి:జిల్లా అదనపు కలెక్టర్ పాండు
చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు.. 31లోగా దరఖాస్తు చేసుకోవాలి:జిల్లా అదనపు కలెక్టర్ పాండు
Krishna
చేయూత సామాజిక భద్రత పింఛన్ల పథకం–2026 కింద కొత్తగా పెన్షన్లు పొందేందుకు అర్హులైన వారు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ పాండు కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో పథకానికి సంబంధించిన పోస్టర్, బ్యానర్, కరపత్రాలను జిల్లా పరిషత్ సీఈఓ జానకిరెడ్డి, డీఆర్డీఏ అదనపు పీడీ సూర్యారావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హీమోఫీలియా బాధితులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, గ్రేడ్–2, గ్రేడ్–3 పైలేరియా బాధితులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దివ్యాంగులకు కనీసం 40 శాతం వైకల్యం ఉండి సదరం లేదా యూడీఐడీ ధృవీకరణ అవసరమన్నారు. వితంతువులు 18 సంవత్సరాలు పైబడి, భర్త మరణ ధృవీకరణ పత్రం కలిగి ఉండాలని, ఒంటరి మహిళలు 18 సంవత్సరాలు పైబడి భర్తతో విడిపోయి లేదా వదిలివేయబడి కనీసం ఏడాది పూర్తయి ఉండాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 30 సంవత్సరాలు, పట్టణ ప్రాంతాల్లో 35 సంవత్సరాలు పైబడిన అవివాహిత మహిళలు కూడా అర్హులన్నారు. కల్లుగీత, చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు పైబడి సంబంధిత శాఖల ధృవీకరణ ఉండాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు, పురపాలక కమిషనర్లు దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పారు. అలాగే చేయూత అధికారిక వెబ్సైట్లోని ‘చేయూత దరఖాస్తు ఫారాలు’ ద్వారా ఫారాలను పొందవచ్చన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనం అందేలా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్, అర్హులైన వారు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి