Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తీజ్ వేడుకల్లో సంప్రదాయ నృత్యాలతో సందడి.. పాల్గొన్న పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 08:16 PM

నేరాల అదుపుకు, ప్రమాదాల నివారణకు ప్రణాళికతో పోలీసు కృషి. - ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు.

నేరాల అదుపుకు, ప్రమాదాల నివారణకు ప్రణాళికతో పోలీసు కృషి. - ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు.

నేరాల అదుపుకు, ప్రమాదాల నివారణకు ప్రణాళికతో పోలీసు కృషి. - ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు.
27-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

పోలీసు స్టేషన్ ల,పోలీసు కార్యాలయాల వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ కోదాడ డివిజన్ డీఎస్పీ కార్యాలయాన్ని,కోదాడ పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది కవాతును పరిశీలించారు‌.ఆయా కార్యాలయాల ప్రాంగణంలో మొక్కలను నాటారు. ప్రజల భద్రతలో అనుక్షణం కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక సద్వినియోగంతో స్మార్ట్ పోలీసింగ్ నిర్వహించాలని సూచించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు డ్రంకన్ డ్రైవ్ రిజిస్టర్, ఎన్ఫోర్స్మెంట్ రిజిస్టర్ లు పరిశీలించారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ పునరుద్ధరణకు ట్రాఫిక్ పోలీస్ కృషి చేయాలి, ఆపరేషన్ రోప్ ను సమర్థవంతంగా అమలు చేయాలి, మద్యం మత్తులో వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలి, యువత డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ పై దృష్టి పెట్టాలి స్పెషల్ డ్రైవ్స్ , ట్రాఫిక్ ఉలంగాలపై ఆకస్మిక తనికీలు చేయాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు.డీఎస్పీ కార్యాలయం నందు నిర్వహిస్తున్న వివిధ రకాల రిజిస్టర్ లు పరిశీలించారు. వరకత్నపు హత్య, ఆత్మహత్యల కేసులు, తీవ్రమైన చీటింగ్ కేసులు, అట్రాసిటీ కేసులు, మైనర్ లపై వేధింపుల కేసులు మొదలగు వాటిల్లో డిఎస్పీ దర్యాప్తు అధికారిగా ఉంటారు ఇలాంటి కేసుల పురోగతిని పరిశీలించారు. డివిజన్ పరిధిలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్ ల పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, సిబ్బంది పనితీరును మెరుగయ్యేలా కృషి చేయాలని డిఎస్పీ కి తెలిపినారు. సామాజిక అంశాల పట్ల, భద్రత అంశాల పట్ల ప్రజలను చైతన్య పరచాలి అని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నిర్మూలించడంలో కృషి చేయాలీ, రహదారుల వెంట ఉన్న గ్రామాల ప్రజలను, హోటల్స్, టి దుకాణాలు ఇతర వ్యాపారాల నిర్వాహకులను చైతన్యపరిచి రోడ్డు ప్రమాదాలు జరగకుండా వారి వ్యాపారాల వద్ద జాగ్రతాలు పాటింపచేయాలి. CCTV కెమెరాల ఏర్పాటు చేయాలి. రహదారి భద్రతకు అన్ని శాఖలతో సమన్వయంతో పని చేయాలి హైవే పెట్రోలింగ్ నిరంతరం చేయాలి, వాహనాలు అక్రమ పార్కింగ్ చేయకుండా ఎన్ఫోర్స్మెంట్ చేయాలని సూచించారు. సైబర్ మోసాల పట్ల ప్రజలను చైతన్యం చేయాలి మునగాల, నడిగుడెం, చిలుకూరు మండలాల పరిధిలో గ్రామాల్లో యువతకు సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించారు, ఇక్కడ కొంత మంది అత్యాశకు పోయి ఆన్లైన్ పెట్టుబడుల విషయంలో సైబర్ మోసగాళ్ల మాయలో పడ్డారు, పరేషాన్ క్రాక్ డౌన్ ద్వారా చర్యలు చేపట్టగా ఈ ప్రాంతలో సైబర్ నేరాలు అదుపు చేశాం అన్నారు.ఈ తనిఖీల్లో కోదాడ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్పెక్టర్ లు శివశంకర్, చరమందరాజు, రామకృష్ణా రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, ఎస్ఐ లు నవీన్, మోహన్, స్టోర్ ఆర్ఎస్ఐ అఖిల్, డిసిఆర్బీ సిబ్బంది అంజన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సీసీ సందీప్, టెక్నికల్ కానిస్టేబుల్ అబెద్, సిబ్బంది ఉన్నారు.....

Sthanikam

నేరాల అదుపుకు, ప్రమాదాల నివారణకు ప్రణాళికతో పోలీసు కృషి. - ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు.

Article Image

పోలీసు స్టేషన్ ల,పోలీసు కార్యాలయాల వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ కోదాడ డివిజన్ డీఎస్పీ కార్యాలయాన్ని,కోదాడ పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది కవాతును పరిశీలించారు‌.ఆయా కార్యాలయాల ప్రాంగణంలో మొక్కలను నాటారు. ప్రజల భద్రతలో అనుక్షణం కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక సద్వినియోగంతో స్మార్ట్ పోలీసింగ్ నిర్వహించాలని సూచించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు డ్రంకన్ డ్రైవ్ రిజిస్టర్, ఎన్ఫోర్స్మెంట్ రిజిస్టర్ లు పరిశీలించారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ పునరుద్ధరణకు ట్రాఫిక్ పోలీస్ కృషి చేయాలి, ఆపరేషన్ రోప్ ను సమర్థవంతంగా అమలు చేయాలి, మద్యం మత్తులో వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలి, యువత డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ పై దృష్టి పెట్టాలి స్పెషల్ డ్రైవ్స్ , ట్రాఫిక్ ఉలంగాలపై ఆకస్మిక తనికీలు చేయాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు.డీఎస్పీ కార్యాలయం నందు నిర్వహిస్తున్న వివిధ రకాల రిజిస్టర్ లు పరిశీలించారు. వరకత్నపు హత్య, ఆత్మహత్యల కేసులు, తీవ్రమైన చీటింగ్ కేసులు, అట్రాసిటీ కేసులు, మైనర్ లపై వేధింపుల కేసులు మొదలగు వాటిల్లో డిఎస్పీ దర్యాప్తు అధికారిగా ఉంటారు ఇలాంటి కేసుల పురోగతిని పరిశీలించారు. డివిజన్ పరిధిలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్ ల పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, సిబ్బంది పనితీరును మెరుగయ్యేలా కృషి చేయాలని డిఎస్పీ కి తెలిపినారు. సామాజిక అంశాల పట్ల, భద్రత అంశాల పట్ల ప్రజలను చైతన్య పరచాలి అని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నిర్మూలించడంలో కృషి చేయాలీ, రహదారుల వెంట ఉన్న గ్రామాల ప్రజలను, హోటల్స్, టి దుకాణాలు ఇతర వ్యాపారాల నిర్వాహకులను చైతన్యపరిచి రోడ్డు ప్రమాదాలు జరగకుండా వారి వ్యాపారాల వద్ద జాగ్రతాలు పాటింపచేయాలి. CCTV కెమెరాల ఏర్పాటు చేయాలి. రహదారి భద్రతకు అన్ని శాఖలతో సమన్వయంతో పని చేయాలి హైవే పెట్రోలింగ్ నిరంతరం చేయాలి, వాహనాలు అక్రమ పార్కింగ్ చేయకుండా ఎన్ఫోర్స్మెంట్ చేయాలని సూచించారు. సైబర్ మోసాల పట్ల ప్రజలను చైతన్యం చేయాలి మునగాల, నడిగుడెం, చిలుకూరు మండలాల పరిధిలో గ్రామాల్లో యువతకు సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించారు, ఇక్కడ కొంత మంది అత్యాశకు పోయి ఆన్లైన్ పెట్టుబడుల విషయంలో సైబర్ మోసగాళ్ల మాయలో పడ్డారు, పరేషాన్ క్రాక్ డౌన్ ద్వారా చర్యలు చేపట్టగా ఈ ప్రాంతలో సైబర్ నేరాలు అదుపు చేశాం అన్నారు.ఈ తనిఖీల్లో కోదాడ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్పెక్టర్ లు శివశంకర్, చరమందరాజు, రామకృష్ణా రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, ఎస్ఐ లు నవీన్, మోహన్, స్టోర్ ఆర్ఎస్ఐ అఖిల్, డిసిఆర్బీ సిబ్బంది అంజన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సీసీ సందీప్, టెక్నికల్ కానిస్టేబుల్ అబెద్, సిబ్బంది ఉన్నారు.....

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News