Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి పాఠశాలలో ఘనంగా బోనాలు, వరలక్ష్మి వ్రతం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:38 PM

పోలీసులకు రాఖీలు కట్టిన విద్యార్థులు

పోలీసులకు రాఖీలు కట్టిన విద్యార్థులు

పోలీసులకు రాఖీలు కట్టిన విద్యార్థులు
27-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రక్షాబంధన్ వేడుకలను పురస్కరించుకుని చౌటుప్పల్ మండల కేంద్రంలో నలంద కళాశాల విద్యార్థులు గురువారం శాంతిభద్రతల పరిరక్షకులకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన విద్యార్థులు, పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పోలీసు అధికారులకు, సిబ్బందికి రాఖీలు కట్టారు.ఈ సందర్భంగా చౌటుప్పల్ ఎస్‌హెచ్‌ఓ, ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్, ఎస్‌ఐలు కే. యాదగిరి, కృష్ణమాల్, రవీందర్, అజయ్ భార్గవ్‌లతో పాటు ఇతర పోలీస్ సిబ్బందికి విద్యార్థినులు రాఖీలు కట్టారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ... రాత్రింబవళ్ళు ప్రజా రక్షణ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా శ్రమిస్తున్న పోలీసుల సేవలు అభినందనీయమన్నారు. రక్షాబంధన్ సోదరభావానికి, ఆత్మీయతకు ప్రతీక అని పేర్కొన్నారు. ​ఈ సందర్భంగా పోలీస్ అధికారులు విద్యార్థులకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు చదువులో క్రమశిక్షణ పాటిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, పోలీసు శాఖ మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని, నమ్మకాన్ని మరింత బలోపేతం చేసిందని సీఐ మన్మధ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ వేడుకల్లో కళాశాల విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

పోలీసులకు రాఖీలు కట్టిన విద్యార్థులు

Article Image

రక్షాబంధన్ వేడుకలను పురస్కరించుకుని చౌటుప్పల్ మండల కేంద్రంలో నలంద కళాశాల విద్యార్థులు గురువారం శాంతిభద్రతల పరిరక్షకులకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన విద్యార్థులు, పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పోలీసు అధికారులకు, సిబ్బందికి రాఖీలు కట్టారు.ఈ సందర్భంగా చౌటుప్పల్ ఎస్‌హెచ్‌ఓ, ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్, ఎస్‌ఐలు కే. యాదగిరి, కృష్ణమాల్, రవీందర్, అజయ్ భార్గవ్‌లతో పాటు ఇతర పోలీస్ సిబ్బందికి విద్యార్థినులు రాఖీలు కట్టారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ... రాత్రింబవళ్ళు ప్రజా రక్షణ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా శ్రమిస్తున్న పోలీసుల సేవలు అభినందనీయమన్నారు. రక్షాబంధన్ సోదరభావానికి, ఆత్మీయతకు ప్రతీక అని పేర్కొన్నారు. ​ఈ సందర్భంగా పోలీస్ అధికారులు విద్యార్థులకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు చదువులో క్రమశిక్షణ పాటిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, పోలీసు శాఖ మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని, నమ్మకాన్ని మరింత బలోపేతం చేసిందని సీఐ మన్మధ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ వేడుకల్లో కళాశాల విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News