Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెంకటాపురం పాఠశాల విద్యార్థులకు షూలు, సాక్స్‌ల పంపిణీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 01:02 PM

నిదానపల్లిలో ఓటర్ల జాబితాపై ప్రత్యేక సవరణ సభ

నిదానపల్లిలో ఓటర్ల జాబితాపై ప్రత్యేక సవరణ సభ

నిదానపల్లిలో ఓటర్ల జాబితాపై ప్రత్యేక సవరణ సభ
27-08-2026 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్ది, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో నిదానపల్లి గ్రామ పంచాయతీలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ఆధ్వర్యంలో, ఆర్‌ఐ శోభ నేతృత్వంలో జరిగిన సభలో బీఎల్వో బబ్బూరి నాగమణి గ్రామస్థులకు ఓటర్ల జాబితాపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలోని ఓటర్ల జాబితాను గ్రామస్థుల సమక్షంలో చదివి వినిపించారు. నిదానపల్లి గ్రామ జాబితాలో మొత్తం 140 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పేరు, తండ్రి/భర్త పేరు, వయస్సు, ఇంటి నంబర్ తదితర వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. జాబితాలో తప్పులు ఉంటే సంబంధిత ఫారాల ద్వారా సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హులైన కొత్త ఓటర్లు తమ పేర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. బోగస్ ఓట్ల తొలగింపు, అన్‌మ్యాపింగ్‌ ప్రక్రియపై కూడా అవగాహన కల్పించారు.

నోటీసులు వస్తే ఆందోళన వద్దు.

ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేసిన సందర్భంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్, పాన్‌కార్డు, ఫొటోతో కూడిన బ్యాంకు లేదా పోస్టాఫీస్‌ పాస్‌బుక్, రేషన్‌కార్డు, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డుల్లో తగిన పత్రాలను సమర్పించి తమ వివరాలను ధ్రువీకరించుకోవచ్చని తెలిపారు. సందేహాలుంటే బీఎల్వో లేదా తహసీల్దార్‌ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ కొండ అండాలు, జీపీఓ లక్ష్మి, వార్డు సభ్యులు వంగాల పూజిత, కడారి ఐలయ్య, భాషమల్ల అనిత, విబికే నారపాక హారిక, నాయకులు నారపాక రవి, రాపోలు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

నిదానపల్లిలో ఓటర్ల జాబితాపై ప్రత్యేక సవరణ సభ

Article Image

రామన్నపేట

ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్ది, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో నిదానపల్లి గ్రామ పంచాయతీలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ఆధ్వర్యంలో, ఆర్‌ఐ శోభ నేతృత్వంలో జరిగిన సభలో బీఎల్వో బబ్బూరి నాగమణి గ్రామస్థులకు ఓటర్ల జాబితాపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలోని ఓటర్ల జాబితాను గ్రామస్థుల సమక్షంలో చదివి వినిపించారు. నిదానపల్లి గ్రామ జాబితాలో మొత్తం 140 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పేరు, తండ్రి/భర్త పేరు, వయస్సు, ఇంటి నంబర్ తదితర వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. జాబితాలో తప్పులు ఉంటే సంబంధిత ఫారాల ద్వారా సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హులైన కొత్త ఓటర్లు తమ పేర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. బోగస్ ఓట్ల తొలగింపు, అన్‌మ్యాపింగ్‌ ప్రక్రియపై కూడా అవగాహన కల్పించారు.

నోటీసులు వస్తే ఆందోళన వద్దు.

ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేసిన సందర్భంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్, పాన్‌కార్డు, ఫొటోతో కూడిన బ్యాంకు లేదా పోస్టాఫీస్‌ పాస్‌బుక్, రేషన్‌కార్డు, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డుల్లో తగిన పత్రాలను సమర్పించి తమ వివరాలను ధ్రువీకరించుకోవచ్చని తెలిపారు. సందేహాలుంటే బీఎల్వో లేదా తహసీల్దార్‌ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ కొండ అండాలు, జీపీఓ లక్ష్మి, వార్డు సభ్యులు వంగాల పూజిత, కడారి ఐలయ్య, భాషమల్ల అనిత, విబికే నారపాక హారిక, నాయకులు నారపాక రవి, రాపోలు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News