Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తడ్కల్‌లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు.. భారీ ర్యాలీలో పాల్గొన్న యువత, ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 07:33 PM

దోరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

దోరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

దోరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
26-08-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి


మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి


క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం


సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ప్రాణనష్టం సంభవించడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికుల జీవితాలు మార్గమధ్యంలోనే విషాదాంతం కావడం హృదయవిదారకమని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ అపార విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన ప్రతి ఒక్కరికీ సకాలంలో అత్యుత్తమ వైద్య సేవలు అందేలా అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, చికిత్స విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చూడాలని సూచించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆకాంక్షించారు.

Sthanikam

దోరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Article Image

మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి


మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి


క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం


సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ప్రాణనష్టం సంభవించడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికుల జీవితాలు మార్గమధ్యంలోనే విషాదాంతం కావడం హృదయవిదారకమని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ అపార విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన ప్రతి ఒక్కరికీ సకాలంలో అత్యుత్తమ వైద్య సేవలు అందేలా అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, చికిత్స విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చూడాలని సూచించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News