కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 42 మందితో వెళ్తుండగా విషాదం.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్ను వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రమాద సమయంలో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. దొరకుంట సమీపంలో ముందు వెళ్తున్న కంటైనర్ను బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కోదాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు, ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి