Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 09:37 AM

కంటైనర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఆరుగురు మృతి

కంటైనర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఆరుగురు మృతి

కంటైనర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఆరుగురు మృతి
26-08-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 42 మందితో వెళ్తుండగా విషాదం.


సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్‌ను వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రమాద సమయంలో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. దొరకుంట సమీపంలో ముందు వెళ్తున్న కంటైనర్‌ను బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కోదాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు, ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Sthanikam

కంటైనర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఆరుగురు మృతి

Article Image

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 42 మందితో వెళ్తుండగా విషాదం.


సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్‌ను వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రమాద సమయంలో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. దొరకుంట సమీపంలో ముందు వెళ్తున్న కంటైనర్‌ను బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కోదాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు, ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News